amp pages | Sakshi

ఆమోదం లాంఛనమే!

Published on Sat, 01/25/2020 - 05:14

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోద ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కేంద్ర జలసంఘం టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) రూ.55,548.87 కోట్లతో ఖరారు చేసిన పోలవరం సవరణ ప్రతిపాదనలను ఆర్‌ఈసీ (రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ) పరిశీలించింది. ఆర్‌ఈసీ ఛైర్మన్‌ జగన్‌మోహన్‌ గుప్తా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలోని అధికారుల బృందంతో పలుమార్లు సమావేశమై పనుల పరిమాణం, భూసేకరణ, పునరావాస కల్పన వ్యయంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించిన ఆర్‌ఈసీ వారం రోజుల్లోగా కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపనున్నట్లు ఆదిత్యనాథ్‌ దాస్‌కు శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిమండలికి ప్రతిపాదనలు పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆమోదం పొందడం ఇక లాంఛనమే. 

కొత్త చట్టంతో పెరిగిన వ్యయం 
2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు మాత్రమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం వంద శాతం ఖర్చు భరించి శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం 2013లో కొత్తగా భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చాక భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం భారీగా పెరిగింది. తాజా ధరల మేరకు పనుల వ్యయమూ పెరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు 2017–18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల సవరించిన ప్రతిపాదనలు పంపింది. దీన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ టీఏసీ రూ.55,548.87 కోట్లకు అంచనాలను సవరిస్తూ ఆమోద ముద్ర వేసింది. 

- సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం పనుల వ్యయం రూ.22,380.54 కోట్లు. ఇందులో 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. 
భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.33,168.24 కోట్లు. 
అయితే పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం మెలిక పెట్టింది. ఆర్‌ఈసీ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం వ్యయం రూ.51,424.23 కోట్లు అవుతుంది. ఇందులో పనుల వ్యయం రూ.18,255.99 కోట్లు.  
- పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,966.13 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.34,458.10 కోట్లు అవసరం.  
- పోలవరం కోసం 2014 ఏప్రిల్‌ 1కి ముందు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన వ్యయం రూ.11,830.26 కోట్లు. ఇప్పటిదాకా రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. ఇటీవల రూ.1,850 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.3,253 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాలి.   

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)