amp pages | Sakshi

ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు అంత ఈజీ కాదు

Published on Thu, 04/18/2019 - 03:58

సాక్షి, అమరావతి: ప్రయివేటు రంగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యాసంస్థలకు ఇక ఫుల్‌స్టాప్‌ పడనుంది. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్‌ కాలేజీలను కట్టడి చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేయకుండా ఇకపై ఆయా రాష్ట్రాల అవసరం మాత్రమే కాలేజీల ఏర్పాటుకు అనుమతించనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలనుంచి ముందుగానే ప్రణాళికలను తెప్పించి వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ఉన్న సదుపాయాలు, ల్యాబ్‌లు, ఇతర ఏర్పాట్లు, ప్రమాణాల తీరు తదితర అంశాలపై ఆగస్టులోగా తమకు నివేదికలు పంపాలని ఏఐసీటీఈ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పండాదాస్‌ తెలిపారు.  ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూ పోతోంది. ఆయా కాలేజీల్లో సదుపాయాలు ఇతర ఏర్పాట్లపై పైపై పరిశీలనతోనే సరిపెడుతోంది.

ఏఐసీటీఈ అనుమతి వచ్చాక రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వం వాటికి గుర్తింపు ఇవ్వక తప్పనిపరిస్థితి. దీంతో వందలాదిగా కాలేజీలు పుట్టుకొచ్చి సీట్ల సంఖ్య లక్షలకు చేరుకుంది. ఏటా వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీ కాలేజీలు 20, ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు 287 ఉన్నాయి. వీటిలో వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులకు సంబంధించి మొత్తం 1,38,953 సీట్లు ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 4,834, ప్రయివేటు కాలేజీల్లో 1,34,119 ఉన్నాయి. ప్రయివేటు కాలేజీల్లోని వివిధ కోర్సులకు డిమాండ్‌ లేక, విద్యార్ధులు చేరక వేలాది సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందగా ఆయా కోర్సులను రద్దుచేసుకొనేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. దీనికి కారణం రాష్ట్రం అవసరాలను చూడకుండా  కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడమే అని గుర్తించి నూతన విధానం తీసుకువచ్చారు.
 

ప్రమాణాల పెంపుకోసమే...
ఇంజనీరింగ్‌ సహా ఆయా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రమాణాల పెంపునకు వీలుగా ఏఐసీటీఈ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ కొత్త విధానం వస్తోంది. ఇంజనీరింగ్‌ విద్యపై ప్రొఫెసర్‌ మోహన్‌రెడ్డి కమిటీ నివేదిక మేరకు పలు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కార్యక్రమం కింద ప్రపంచ బ్యాంకు నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి అవకాశాల కల్పన, కమ్యూనికేషన్‌ స్కిల్స్, డొమైన్‌ స్కిల్స్‌ మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాలేజీలకు పారిశ్రామిక అనుసంధానం ద్వారా విద్యార్థుల్లో మెలకువలను పెంపొందించనున్నారు. అలాగే నేటి పారిశ్రామిక అవసరాలు, రోజురోజుకు మారిపోతున్న సాంకేతికతల నేపథ్యంలో ప్రస్తుతమున్న కోర్సుల్లోనూ అనేక మార్పులు చేయనున్నారు. సాంప్రదాయంగా ఉన్న సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ వంటి కోర్సుల్లో కొత్త సాంకేతిక అంశాలను చొప్పించనున్నారు. కొత్త అంశాలతో కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్, బ్లాక్‌చైనా, డాటా సైన్సెస్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

క్షేత్రస్థాయి అభ్యసనానికి ప్రాధాన్యం
నాలుగు గోడల మధ్య థియరీలను వినడం, చదవడం ద్వారా కాకుండా క్షేత్రస్థాయిలో అభ్యసనానికి శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నది ఏఐసీటీఈ అభిప్రాయం. ఇప్పటికే ఈ దిశగా అన్ని యూనివర్సిటీలకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న ఏడాదినుంచి పారిశ్రామిక అనుసంధానాన్ని మరింత పెంచి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యతనిస్తారు. పారిశ్రామిక శిక్షణ, ఇంటర్న్‌షిప్, ప్రయోగశాలల్లో పరిశోధనలకు పెద్దపీట వేయనున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)