amp pages | Sakshi

అదిగదిగో ఆశాకిరణం!

Published on Tue, 12/11/2018 - 07:25

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అడుగడుగో... మన ఆశాకిరణం... మన ఊరిలోకే వచ్చేస్తున్నాడం టూ...’ పల్లె జనం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వం పట్టించుకోని పలు సమస్యలను ప్రతిపక్ష నేతకు నివేదించేందుకు ముందడుగు వేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు వచ్చిన ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. ప్రభుత్వ తీరుతో అష్టకష్టాలు పడుతున్న వారంతా విన్నవించుకునేందుకు బారులు తీరారు. జగన్‌ వెంట అడుగులో అ డుగు వేశారు. యువతీయువకులు జగన్‌తో సె ల్ఫీ తీయించుకునేందుకు ఉత్సాహం చూపించా రు.   

పాదయాత్ర సాగిందిలా
జన సంక్షేమం కోసం తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం రాగో లులో జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. మ ధ్యాహ్న భోజన విరామ సమయానికి దూసిక్రాస్, బావాజీ పేట, రాగోలుపేట వరకు సాగింది. తర్వాత మళ్లీ ప్రారంభించి ఆమదాలవలస ని యోజకవర్గ పరిధిలోని గట్టుమడిపేట, వంజంగి వరకు, ఆ తర్వాత శ్రీకాకుళం మండలం పరిధి లోని వాకలవలస క్రాస్, లంకాం క్రాస్‌ మీదుగా నందగిరిపేట వరకు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పలువురు రైతులు జగన్‌ను కలిసి పం టల పరిస్థితులను వివరించారు. వంగ పంటకు మద్దతు ధర లేదంటూ ఆవేదన చెందారు. మరో వైపు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాలకు చెందిన చెరుకు రైతులంతా కలిసి ఆమదాలవలసలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించా లంటూ కోరారు. అలాగే జిల్లాలో మత్స్యకారుల ముఖ్య నేతలంతా కలిసి జగన్‌కు తమ వినతులను అందించారు. తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని, దీనికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పకనే చెప్పారు. అలాగే దూసిలోని కాన్‌కాస్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులు కూడా జగన్‌ను కలిశారు. అక్రమ లాకౌట్‌ కారణంగా వందలాది మందిమి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం నాటి యాత్ర జనహోరు నడుమ ముం దుకు సాగింది.  

పాల్గొన్న నాయకులు
పాదయాత్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, రెడ్డి నాగభూషణం, ఎమ్మెల్యేలు కం బాల జోగులు, విశ్వాసరాయి కళావతి, పార్టీ పీఏ సీ సభ్యుడు పాలవలస రాజశేఖరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దు వ్వాడ శ్రీనివాస్, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, గొర్లె కిర ణ్‌ కుమార్, అరుకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజ్, యువనేతలు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎం వీ స్వరూప్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, శ్రీకాకుళం జెడ్పీటీసీ సభ్యుడు చిట్టి జనార్ధనరావు, పలాస పీఏసీఎస్‌ చైర్మన్‌ దువ్వాడ శ్రీధర్, పలాస మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ దువ్వాడ శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, స్థానిక ము ఖ్య నేతలు గేదెల రామారావు, చల్లా రవికుమార్, సు వ్వారి గాంధీ,కాట సాని రాంభూపాలరెడ్డి, యలమంచిలి రవి తదితరులు పాల్గొన్నారు.

కాన్‌కాస్ట్‌ కర్మాగారం తెరిపించండి
పోలాకి: ఆమదాలవలస మండలం దూసి గ్రా మం వద్ద ఉన్న ‘కాన్‌కాస్ట్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమి టెడ్‌’ కర్మాగారం 16నెలలుగా మూతపడిందని, తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కాన్‌కాస్ట్‌ కార్మికులు పాదయాత్రలో కలసి మొరపెట్టుకున్నారు. 700 మంది కార్మికులకు కనీసం ముం దస్తు సమాచారం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి 6 నెలల జీతా లతోపాటు, బోనస్‌లు, పీఎఫ్‌ తదితర చెల్లింపులు దాదాపు 13 కోట్ల రూపాయలు వరకు ఎగ్గొట్టేం దుకు కుట్ర జరుగుతోందని వివరించారు.  

మత్స్యకారులకు న్యాయం చేయండి
సోంపేట: జిల్లాలోని తీర ప్రాంతంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న మత్స్యకార సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రతిపక్ష నే త వైస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తీర ప్రాంత మత్స్యకార ప్రతినిధులు కోరారు. నందివానిపేట వద్ద జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఉపాధి లేక ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలస వెళ్తున్నారని తెలిపారు. జిల్లాలో 98 మంది సముద్రంలో చనిపోయితే వారికి ఇప్పటివరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదన్నారు. విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకు ఒక్క జెట్టీ కూడా లేదన్నారు. పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించాలని కోరారు.

నేడు ఆమదాలవలసలో భారీ బహిరంగ సభ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవా రం సాయంత్రం 3 గంటల నుంచి ఆమదాలవలస పట్టణంలో ప్రభుత్వ కళాశాల రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం మండలం నందగిరిపేట నుంచి ప్రారంభమయ్యే ప్రజాసంకల్పయాత్ర మధ్యాహ్నం సమయానికి ఆమదాలవలస పట్టణంలో ప్రవేశిస్తుంది.పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని తమ్మినేని సీతారాం కోరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)