ఇడుపులపాయలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎంపీ

Published on Wed, 10/02/2019 - 19:14

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా 27 వేల శాశ్వత ఉద్యోగాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపుల పాయలో గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతమన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే గ్రామ స్థాయి ఉద్యోగులు దృఢసంకల్పంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ రవికుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ