రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తల్లడిల్లిన తల్లి హృదయం
Published on Tue, 01/07/2020 - 13:25
శ్రీకాకుళం, పలాస: తల్లి హృదయం తల్లడిల్లింది. ఒక్కగానొక్క కుమారుడు తనకు తలకొరివి పెడతాడనుకుంటే తానే కుమారిడి చితికి నిప్పుపెట్టాల్సి వచ్చిందని ఆ మాతృమూర్తి రోదన అందరిచేత కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పలాస మండలం టెక్కలిపట్నంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన నార్ల బుచ్చిబాబు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకొని జీవిస్తుండేవాడు. భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి నార్ల పార్వతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. బుచ్చిబాబు గత కొంత కాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. పేదరికం వల్ల సరైన వైద్య చేయించుకోలేక మంచం పట్టాడు. తన ఇంటిలోనే ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రి చాలా క్రితం మృతి చెందారు. తల్లి పార్వతి దహన సంస్కారాలు చేసింది. ఈ సంఘటన చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు.
#
Tags