రైతులను ఆదుకుంటాం:పార్థసారధి

Published on Mon, 08/19/2019 - 12:07

సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలైన యలమలకుదురు, పెద్ద పులిపాకలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి సోమవారం పర్యటించారు. యలమలకుదురులో డంపింగ్‌ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పెద పులిపాక వరుకు రిటర్నింగ్‌ వాల్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కృష్ణమ్మ శాంతించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని..రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు.

వరద సహాయక కేంద్రాలను పరిశీలించిన ఎంపీ పొట్లూరి.. 
ఇబ్రహీంపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం విజయవాడ ఎంపీ పొట్లూరి వరప్రసాద్‌ పర్యటించారు. వరద సహాయక కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.వరద బాధితులను పరామర్శించి..ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు.ఆయన వెంటన వైఎస్సాఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ