amp pages | Sakshi

బాధిత కుటుంబానికి పరామర్శ

Published on Mon, 12/16/2019 - 13:11

త్రిపురాంతకం: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని యువతి కుటుంబాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలు ఆదివారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఏపీ దిశ 2019 చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. మంత్రి వనిత మాట్లాడుతు రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళల పట్ల జరుగుతున్న సంఘటనలు పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైన శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. పురుషులు రాత్రి  పనులకు వెళ్లిన సమయంలో ఏవిధంగా తమను ఏవిదంగా కాపాడుకోవాలి, పాఠశాలల్లో, కళాశాలలో చదువుకునే వారికి పురుషులు దాడులు వంటివి, ఇతరత్రా కాపాడుకునే విషయాలపై శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివరించారు.

ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, కార్యకర్తల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి తానేటి వనిత వివరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు పడే విదంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి 21 రోజుల్లోనే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి  స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయలు ప్రకటించి ముందస్తుగా 25వేల రూపాయల చెక్కును అందించారు. వైఎస్సార్‌ సీసీ స్థానిక నాయకులు యాభైవేల రూపాయల నగదు సురేష్‌ చేతుల మీదుగా అందించారు. వీరి వెంట పీడీ విశాలాక్షి, ఆర్‌డీఓ శేషిరెడ్డి, తహసీల్దార్‌ జయపాల్, సీఐ మారుతీకృష్ణ, సూపర్‌వైజర్లు పద్మజ, రత్నం, పి. చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?