amp pages | Sakshi

వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది: కొడాలి నాని

Published on Tue, 10/15/2019 - 13:19

సాక్షి, కృష్ణా :  ‘వైఎస్సార్‌ రైతు భరోసా.. పీఎం కిసాన్‌’ కార్యక్రమాన్ని గుడివాడ మార్కెట్‌ యార్డులో పౌర సరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి కొడాలి నాని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అర్హులైన రైతులకు చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని నమ్మే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. రైతు భరోసాను రూ.12,500 నుంచి రూ13,500లకు పెంచిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద నాలుగేళ్లలో రూ. 50 వేలు ఇస్తానన్న సీఎం మరో ఏడాదిని పెంచి ఐదేళ్లలో రూ. 67,500 ఇవ్వనున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కంటే అదనంగా మరో 17,500 ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు ఏటా రూ.12,500లకు బదులుగా రూ. 13,500 జగన్‌ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితిలోనూ అర్హత ఉన్నవారు మిగిలిపోకుడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

ఇందులో భాగంగా దరఖాస్తు గడువును నవంబర్‌ 15 వరకూ పొడిగించామని మంత్రి కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజా సాధికారత సర్వే ద్వారా ఎంపికైన రైతులు 43 లక్షలు ఉంటే తమ ప్రభుత్వంలో 51 లక్షల మంది ఉన్నారని, వారితో పాటు అదనంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందిన మరో 3 లక్షల మంది రైతులకు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఒకవేళ అర్హుడైన రైతు మరణిస్తే ఈ పథకం ఆ రైతు భార్యకు వర్తించేలా సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో దాదాపు రాష్ట్రంలో 1.15 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటే వారికి కూడా ఈ ఫథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌