మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు
Published on Sat, 04/25/2015 - 13:10
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భూమి స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ఉండి, విశాఖలో మధురవాడ, మురళీనగర్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి, ఉద్దానం, విజయవాడ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో భూప్రకంపనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#
Tags