amp pages | Sakshi

‘మత్తు’ దిగుతోంది..!

Published on Sat, 06/27/2015 - 03:45

తణుకు/తణుకు అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్‌పాలసీ మద్యం వ్యాపారుల్లో గుబులు పుట్టిస్తోంది. నిబంధనలు కఠినతరం చేయడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు. రెండేళ్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధనతో పాటు ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లోని అత్యధికంగా అమ్మకాలు జరిపే దుకాణాలను తన వద్ద ఉంచుకోవడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లెసైన్‌‌స ఈ నెలాఖరుతో ముగియనుండగా జులై 1 నుంచి నూతన పాలసీ ప్రకారం కొత్త షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణకు అధికారులు తెరతీశారు. తొలుత  స్పందన అంతంతమాత్రంగానే ఉన్నా శుక్రవారం భారీగానే దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది కొత్తవారు కావడం గమనార్హం.      
 
 జిల్లాలో 428 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించనుండగా వీటిలో పది శాతం షాపులను మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదిలా ఉంటే నూతన పాలసీ, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటుతో ఇకపై తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు, లెసైన్సు ఫీజులు, అద్దెలు పెరిగిపోవడంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు కొత్త దుకాణాల ఏర్పాటుపై అంతగా ఆసక్తి చూపడం లేదు.  గతంలో దరఖాస్తుతో పాటు కేవలం పాన్ ఖాతా నంబర్ పేర్కొనే నిబంధన సడలించి ఐటీ రిటర్న్స్ సమర్పించాలని కోరుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గతంలో రూ. 25 వేలు ఉన్న నాన్ రిఫండబుల్ (తిరిగిరానిది) ప్రస్తుతం గ్రామాల్లో రూ.30 వేలు, పట్టణాల్లో రూ.40 వేలు, కార్పొరేషన్‌లో రూ. 50 వేలు నిబంధన కూడా ఇబ్బందిగానే మారింది.
 
 సర్కారీ నిర్ణయం ఫలితాలనిచ్చేనా?
 మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఎమ్మార్పీకే అమ్మకాలు చేపట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల నిర్వహణ విధానం ప్రైవేట్ షాపులను ప్రోత్సహించేలా ఉంటే ఫలితం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇలాంటి విధానం అమలు చేశారు. అయితే కేవలం చీప్ లిక్కర్‌కు సంబంధించిన నిల్వలు మాత్రమే అందుబాటులో ఉండటంతో పాటు అధిక ధరలున్న మద్యం నిల్వలు ఉండేవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధానం ఫలితాలు ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)