వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
'ఆరు నెలల పాలనలో పారదర్శకతను చూపారు'
Published on Sat, 11/30/2019 - 19:35
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపట్టి నేటితో ఆరు నెలల పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యలయంలో కార్యకర్తల సమక్షంలో విష్ణు కేక్ను కట్ చేశారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ప్రజల డోర్ వద్దకే తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఈ ఆరునెలల పాలనలో పారదర్శకత చూపిస్తూ వందకు వంద మార్కులు సాధించారని కొనియాడారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ అవినీతిపై యుద్దం ప్రకటించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం,వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు పెద్ద పీఠ వేశారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 80 శాతం అమలు చేశారని పేర్కొన్నారు. స్పందన, అమ్మ ఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటి పథకాలతో జన హృదయ నేతగా నిలిచారని తెలిపారు.
Tags