amp pages | Sakshi

బాణసంచా కాదు..బాంబులు పేలాయి!

Published on Tue, 11/11/2014 - 00:55

* వాకతిప్ప విస్ఫోటంపై సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరపాలి
* ‘వాకతిప్ప’ బాధితుల డిమాండ్
* మేజిస్టీరియల్ విచారణ బహిష్కరణ
* అధికారుల నిర్బంధం
* దళిత, ప్రజాసంఘాలు,అఖిలపక్షం మద్దతు
* అర్ధాంతరంగా ముగించి, వెనుతిరిగిన అధికారులు

పిఠాపురం : ‘బాణసంచా పేరుతో అక్కడ బాంబులు తయారు చేస్తున్నారు. అందువల్లే అంత భారీ పేలుడు జరిగి.. మృతదేహాలు ముక్కలుముక్కలై వందల మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ఈ ఘటన వెనుక నిజాలు బయట పడాలంటే కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వాకతిప్ప బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 20న జరిగిన పేలుడు ఘటనపై.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కాకినాడ ఆర్డీవో అంబేద్కర్ సోమవారం చేపట్టిన మేజిస్టీరియల్ విచారణను బాధిత కుటుంబాలు బహిష్కరించాయి.

సాయంత్రం 3 గంటలకు ఆర్డీవో విచారణ ప్రారంభించారు. దళిత, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో.. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన పదిమంది మృతుల కుటుంబ సభ్యులు ప్రదర్శనగా విచారణకు వచ్చారు. బాధిత కుటుంబీకులు వారి అనుమానాలను, ఆధారాలను తెలియజేయాలని ఆర్డీవో సూచించారు. మృతుల్లో ద్రాక్షారపు చినబుల్లి కుటుంబానికి పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బాధితులు నిలదీశారు. ఇది కేవలం మేజిస్టీరియల్ విచారణని, ఇందులో వివరాలు సేకరిస్తామే తప్ప సమస్యలు పరిష్కరించడం తన పరిధిలో ఉండదని ఆర్డీవో చెప్పారు. ఆమె మృతిని ఇంకా ధ్రువీకరించలేదని, డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతిని ధ్రువీకరించి పరిహారం అందిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన బాధితులు.. ‘ఆ విషయం మీ పరిధిలోది కాకపోతే విచారణ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

జరిగిన దారుణంపై సక్రమంగా స్పందించ లేదంటూ కలెక్టర్, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఆర్డీవో, ఇతర అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోతే వెంటనే విచారణ జరపాల్సిందిపోయి, ప్రమాదం జరిగిన 22 రోజుల తరువాత విచారణ ప్రారంభించడమేమిటని నిలదీశారు. లెసైన్‌‌స మంజూరు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ ఆర్డీవో అంబేద్కర్‌నే విచారణాధికారిగా నియమించడం చూస్తే.. దొంగ చేతికే తాళాలిచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. మేజిస్టీరియల్ విచారణను తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే నిలిపివేసి, ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగినా విచారణ కొనసాగిస్తున్న ఆర్డీవోపై మండిపడ్డారు.

విచారణ జరుగుతున్న ఎంపీడీవో కార్యాలయం ప్రహరీ గేటు మూసివేశారు. అధికారులను నిర్బంధించి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణను ఇక్కడితో ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ ప్రారంభించకపోతే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎంఆర్‌పీఎస్ నాయకులు కొమ్ము చినబాబు, ఉల్లంపర్తి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు వేమగిరి వెంకట్రావు, దళిత నాయకులు రాజేంద్ర, మసకపల్లి రాజకుమార్, చింతపర్తి రాంబాబు, పలివెల సత్యానందం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓలేటి రాయభాస్కరరావు, పిల్లి తిరుపతిరావు, విప్పర్తి రామన్న, మందపల్లి శ్యామ్, పిల్లా వరప్రసాద్, వల్లూరి రాజబాబు, దాసరి సత్యనారాయణ, రవణం సుబ్రహ్మణ్యం తదితరులు బాధిత కుటుంబీకులకు సంఘీభావంగా ఆందోళనకు దిగారు.
 
కలెక్టర్ ఆదేశాల మేరకే విచారణ
కలెక్టరు ఆదేశాల మేరకే ఈ విచారణ చేస్తున్నానని, ప్రమాదం ఎలా, ఎందువల్ల జరిగిందన్న విషయాలపై మాత్రమే విచారణ జరుపుతామని, డిమాండ్లను తాము స్వీకరించలేమని విచారణాధికారి ఆర్డీవో అంబేద్కర్ తెలిపారు. బాధితుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో శాంతించిన బాధితులు అడ్డు తొలగడంతో అధికారులు వెళ్లిపోయారు.
 
15న మళ్లీ విచారణ
ఈ నెల 15న మరో దఫా విచారణ జరుపుతామని, బాధితుల కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతర అధికారులను విచారిస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ విచారణ పలుమార్లు జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు వివరాలు సేకరించామని, ఈ సంఘటనకు సంబంధించిన అన్ని శాఖల అధికారులనూ విచారిస్తామని చెప్పారు. ఈ విచారణలో జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపక అధికారి బీజెడీఎస్పీ కుమార్, ఇన్‌చార్జ్ తహశీల్దార్ ప్రసాద్, ఎస్సై ఎన్,కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)