amp pages | Sakshi

వైఎస్సార్‌ సీపీలో భారీగా చేరికలు

Published on Thu, 11/15/2018 - 07:36

ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో  గత కొద్ది రోజులుగా  వివిధ పార్టీలకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకులు  రాజీనామాలు చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఇదే తరహాలో బుధవారం పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. జిల్లాలోని  పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలోని తామరఖండి వద్ద జరిగిన చేరికల్లో జగన్‌ వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో సీతానగరం మండలంలోని కోట సీతారామపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీ పీకే రత్నారావు, మాజీ సర్పంచ్‌ వి.కృష్ణమూర్తి, మాజీ పంచాయతీ ఉపా«ధ్యక్షులు వై.తిరుపతిరావు, మాజీ సర్పంచ్‌ బక్కు శ్రీదేవి, మాజీఎంపీటీసీ చుక్కా శకుంతలమ్మ, తామరఖండి మాజీ ఎంపీటీసీ వేగిరెడ్డి స్వామినాయుడు, ఆర్‌వెంకంపేట  మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెం ట అప్పారావు, బలిజిపేట మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ సుభద్ర, ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ శంకరరావు, అరసాడ మాజీ ఎంపీటీసీ పోలా రామకృష్ణ, పాల సంఘం అధ్యక్షుడు కొల్లి సూర్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్‌ గుల్లిపల్లి  లక్ష్మణరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గుల్లిపల్లి ఈశ్వరరావు పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, బక్కు భవానీ, అల్లు సూర్యనారాయణ, గుంట ప్రకాష్, మూడడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి..
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో బుధవారం చేరారు. పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలోని అప్పయ్యపేట వద్ద మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పలువురు చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన పార్వతీపురం మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ దొడ్డి విజయకృష్ణ, మాజీ కౌన్సిలర్లు బత్తుల సూర్యారావు, బెహరా బాబ్జీ, పాత గౌరీశంకర్, వానపల్లి శంకరరావు, కోట్ల అప్పలనాయుడు, ముగడ జగన్మోహనరావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి చెందిన పార్వతీపురం మండలంలోని గోపాలపట్నం మాజీ సర్పంచ్‌ గవర కృష్ణమూర్తినాయుడు, బలిజిపేట మండలంలోని పదమాయవలస మాజీ సర్పంచ్‌ తట్టికోట పెదప్పలనాయుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌