వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’
Published on Thu, 05/25/2017 - 16:28
హైదరాబాద్: బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమిత్షాతో విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మేలుపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి పోరాడాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు.
#
Tags