amp pages | Sakshi

నేడు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం

Published on Fri, 08/01/2014 - 02:36

  • 16 వేల మందికి పైగా  విద్యార్థులకు పట్టాలు ప్రదానం
  •   ముఖ్యఅతిథిగా జర్మనీ న్యాయమూర్తి పి.సి.రావు రాక
  •   మూడు బంగారు పతకాలు విద్యార్థినులకే
  •   వైస్ చాన్సలర్ ఆచార్య వి.వెంకయ్య వెల్లడి
  • సాక్షి, విజయవాడ : కృష్ణా యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా పీజీ విద్యార్థులతోపాటు డిగ్రీ విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తున్నామని వైస్ చానల్సర్ ఆచార్య వి.వెంకయ్య చెప్పారు. గురువారం స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన యూనివర్సిటీ 2012 డిసెంబర్ 9న  మొదటి స్నాతకోత్సవం జరుపుకొందని, శుక్రవారం రెండో స్నాతకోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు.
     
    వర్సిటీలో ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అన్ని డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయని తెలి పారు. ఈ ఏడాది 16 వేల మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని, వీరిలో 2,276 మంది పీజీ విద్యార్థులు, 14,286 మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసారి డిగ్రీ విద్యార్థులకు కూడా స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. పాస్ పర్సెంటేజ్‌లో విద్యార్థినులే అధికంగా ఉన్నారన్నారు. పీజీ కోర్సులో ఎం.ఫార్మసీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర కోర్సుల్లో మూడు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నామని, వీటికి విద్యార్థినులే ఎంపికయ్యారని వివరించారు.
     
    విజయవాడలో స్నాతకోత్సవం ...
     
    విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా జర్మనీ దేశంలోని హేంబర్గ్‌లో ఉన్న  అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి  జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు (పి.సి.రావు) ముఖ్యఅతిథిగా హాజరవుతారని  చెప్పారు.
     
    బంగారు పతక విజేతలు..

    ఎంఫార్మసీలో బండి సుస్మితకు, ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పనకు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో మల్లాది దీప్తికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)