ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం

Published on Thu, 07/24/2014 - 02:34

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా జె.వి.రాముడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాముడు ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాముడు వాస్తవానికి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయాలి. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదవీ విరమణతో సం బంధం లేకుండా డీజీపీగా నియమించిన వ్యక్తిని రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
 
 దీంతో రాముడు మరో 22 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. డీజీపీ ఎంపిక ప్రక్రియపై ఈ నెల 21న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం డీజీపీ కేడర్‌లోని పది పేర్లను సమర్పించారు. అందులో నుంచి ముగ్గురు పేర్లను యూపీఎస్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మంగళవారం లేఖ రాసింది. అందులో నుంచి రాముడిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆయన బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ