amp pages | Sakshi

తిరుపతిలో రిజిస్ట్రేషన్ల కుంభకోణం?

Published on Sat, 09/14/2019 - 10:43

తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ఇష్టారాజ్యంగా కబ్జాచేశారు. గత ఐదేళ్ల కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పూబెల్లంలా పంచుకుతినేశారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకునేశారు. సర్వే నం.13లోనే 110 ఎకరాలకు సంబంధించి సుమారు 602 అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై కూలంకుషంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పరిధిలో వందలాది ఎకరాలు హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు హథీరాంజీ మఠం భూములపై దృష్టి సారించారు. ఆ భూములను ఐదుగురు వ్యక్తులు కలిసి పంచుకునేశారు. ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులు రిజి స్ట్రేషన్‌ స్థలాలు కావాలని అడగడంతో అక్రమార్కులు సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో కొందరిని సంప్రదించారు. అక్రమార్కులకు రిజిస్టార్‌ కార్యాలయంలోని కొందరు అధికారులు తోడవడంతో విక్రయాలు సులభతరమయ్యాయి. 

అడ్డదారిలో రిజిస్ట్రేషన్‌
చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో తిరుపతి రూరల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్‌ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. 

చేతులు మారిన కోట్ల రూపాయలు
మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్ముక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ముచేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే.. అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూళ్లు చేసి స్థలాలు కొనుగోలుచేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు.  

 చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభిం చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలం లో తిరుపతి రూరల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్‌ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగి నట్లు గుర్తించారు. 

చేతులు మారిన కోట్ల రూపాయలు
మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్మక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ము చేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూలు చేసి స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)