amp pages | Sakshi

పట్టణ ప్రజలపై భారం

Published on Wed, 07/23/2014 - 03:13

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆదాయం కోసం పట్టణ ప్రజలపై భారాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్థలాల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఒంగోలు కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీల్లో భూముల విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుదల 50 నుంచి వంద శాతం వరకూ ఉంటుంది. తద్వారా ఐదు శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

{పభుత్వ విలువ కాకుండా బయట మార్కెట్‌లో భూముల విలువ ఎంత ఉందో గుర్తించి దాని ఆధారంగా భూముల విలువలను నిర్ణయించనున్నారు. పెంచిన విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

ఇప్పటికే ఒంగోలు, చీరాల పట్టణాల్లో భూముల పెరుగుదల ఏ ప్రాంతాల్లో ఉందో గుర్తించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అర్బన్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా లాండ్ కన్వర్షన్ చేసిన వాటిని కూడా గుర్తించనున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని వస్తుందనే భావనతో ధరలు భారీగా పెరగడంతో  ఇక్కడ భూముల ధరలను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు మార్కెట్ విలువలు ఎంత ఉన్నాయన్న సమాచారం సేకరించారు. బహిరంగ మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువలు ఉండేలా ఈ పెంపుదల ఉండబోతోంది.

అధికారులు తమ ప్రతిపాదనలను ఈ నెల 27లోగా సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్లకు అందజేయనున్నారు. వారు వీటిని చర్చించి ఆమోదించిన తర్వాత ఆగస్టు ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఒంగోలు నగరంలో భూముల విలువల పెంపుదల వంద శాతం వరకూ ఉండవచ్చని సమాచారం.

ఒకవైపు రాజధాని విషయంలోనూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటాయిస్తోన్న విద్యాసంస్థల విషయంలో జిల్లాపై పూర్తి అశ్రద్ధ చూపుతున్న రాష్ర్ట ప్రభుత్వం భూముల ధరలు పెంచాలన్న నిర్ణయం తీసుకోనుండటం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)