amp pages | Sakshi

దుర్భిక్ష సీమకు జల రక్ష!

Published on Wed, 05/13/2020 - 04:12

సాక్షి, అమరావతి: కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే వరద జలాలను ఒడిసి పట్టి కరువు పీడిత రాయలసీమలో నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసేందుకే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువున ఎస్సార్బీసీ కాలువ సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీలను ఎస్సార్బీసీలోకి ఎత్తిపోసే పథకాలను చేపట్టామనే అంశాన్ని తెలంగాణ సర్కారుకు, అక్కడి ప్రతిపక్ష నేతలకు, రిటైర్డ్‌ ఇంజనీర్లకు వివరించాలని నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అవాస్తవాలను వల్లె వేస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య శత్రుత్వాన్ని రగిల్చేందుకు కొందరు పన్నుతున్న పన్నాగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. (మన వాటా నీటి కోసమే.. రాయలసీమ ఎత్తిపోతల)

సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ కరువును కడతేర్చడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలువల సామర్థ్యాన్ని పెంచుతోందని, కృష్ణా జలాల వినియోగంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు కట్టుబడి ఉంటామనే అంశాన్ని తెలంగాణకు స్పష్టం చేయాలని కోరింది. దేశ ఆహార అవసరాలను తీర్చాలనే ధ్యేయంతో తెలంగాణ సర్కార్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల  ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిందని ప్రశంసించింది. రాయలసీమ దాహార్తి తీర్చడానికి, కనీసం నాలుగేళ్లకు ఒక్కసారైనా పంటలకు నీళ్లందించి పేదరికాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలువల సామర్థ్యం పెంపునకు తెలంగాణ సర్కార్‌ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్‌ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..  

వరుసగా కరువు కాటకాలు.. 
► రాయలసీమ భౌగోళిక విస్తీర్ణం 67,710 చదరపు కి.మీ. కాగా 5,125 గ్రామాల్లో 1.64 కోట్ల మంది నివసిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉండటం, వరుస కరువుల వల్ల సీమ ప్రజలు గుక్కెడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. 

► 1960 నుంచి వరద ప్రవాహాలను పరిశీలిస్తే నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే కృష్ణా నదికి వరద వస్తుంది. విభజన తర్వాత కృష్ణా నదికి రెండు సార్లు వరద వచ్చింది. 

► కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే వరదను ఒడిసి పట్టి రాయలసీమలో జలాశయాలను నింపడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పోతిరెడ్డిపాడు కాలువల విస్తరణ, సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

స్పిల్‌ వే సామర్థ్యం పెంచాలని సీడబ్ల్యూసీ సూచించింది.. 
2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం స్పిల్‌వే ప్లంజ్‌ పూల్‌ దెబ్బతింది. భారీ వరదను తట్టుకునేలా శ్రీశైలం స్పిల్‌ వే సామర్థ్యాన్ని పెంచాలని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) బృందం సూచించింది. ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల శ్రీశైలం స్పిల్‌వేపై వరద ఉధృతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నాగార్జునసాగర్‌ దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రామాలు, విజయవాడ నగరాన్ని  వరద ముప్పు నుంచి రక్షించడానికి దోహదపడుతుంది.  

వరద వినియోగం కోసం తెలంగాణలో పలు ప్రాజెక్టులు 
► బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు), ఎస్సెల్బీసీ (30 టీఎంసీలు)లపై ట్రిబ్యునల్‌ సానుకూలంగా స్పందించలేదు.  

► అయినా సరే విభజన తర్వాత మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కోసం తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (90 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (30 టీఎంసీలు), మిషన్‌ భగీరథ (19.59 టీఎంసీలు), పాలేరు రిజర్వాయర్‌ నుంచి భక్తరామదాస ఎత్తిపోతల (5.50 టీఎంసీలు), సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (15 టీఎంసీలు), ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు (పది టీఎంసీలు), నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (3.40 టీఎంసీల) చేపట్టడం ద్వారా అదనంగా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి పనులు చేపట్టింది. అంటే.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరద జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ సర్కార్‌ పలు ప్రాజెక్టులు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.   

పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నారు.. 
► బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మిగులు జలాల ఆధారంగా చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టుల పట్ల ట్రిబ్యునల్‌ సానుకూలంగా స్పందించలేదు. మిగుల జలాలను తరలించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కార్‌ పలు ప్రాజెక్టులు చేపట్టిన తరహాలోనే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసి పేదరికాన్ని నిర్మూలించడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలువల విస్తరణ పనులను చేపట్టింది. నికర జలాల కేటాయింపు ఉన్న ఎస్సార్బీసీ (19 టీఎంసీలు), తెలుగుగంగ (25 టీఎంసీలు) ఆయకట్టుకు సక్రమంగా నీటిని సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుంది. 

► ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015 జూన్‌ 19న కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఐదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. ట్రిబ్యునల్‌ అవార్డుకు కట్టుబడి పరస్పర సహకారం, స్నేహపూర్వక వాతావరణంలో కృష్ణా జలాలను వినియోగించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)