వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యను కొట్టి చంపిన భర్త
Published on Tue, 11/24/2015 - 14:53
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త కొట్టడంతో భార్య మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నజీర్(32) హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య మొబీనా(28)తో తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో భార్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నజీర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags