మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేపాడలో అగ్నిప్రమాదం
Published on Mon, 03/30/2015 - 20:57
వేపాడ(విజయనగరం జిల్లా): ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పుంటుకొని ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన సోమవారం విజయనగరం జిల్లా వేపాడ మండలం అతవ గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామంలోని ఒక ఇంటిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రామంలో పూరిళ్లు కావడంతో వెంటనే పక్కనున్న గుడిసెలకు సైతం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఎస్కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని రెవిన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు.
#
Tags