రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో తోపులాట: భక్తులకు గాయాలు
Published on Tue, 05/22/2018 - 16:27
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం కూడా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 56 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా మూడు రోజుల పాటు సర్వదర్శనం స్లాట్ టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత, సర్వదర్శనం టోకెన్లను తిరిగి కొనసాగిస్తామని ఆలయ జేఈవో శ్రీనివాస రాజు తెలిపారు.
సర్వదర్శనం స్లాట్ ద్వారా ఇప్పటి వరకు 5,42,308 మంది టోకెన్లను పొందగా.. వారిలో 54 వేల మంది మాత్రం దర్శనం చేసుకోలేదన్నారు. మరోవైపు అంగప్రదక్షిణ టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుని పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో టీటీడీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు.
#
Tags