వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అహోబిలం అభివృద్ధికి సహకారం
Published on Thu, 02/28/2019 - 07:28
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన అహోబిల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. నవనారసింహులును దర్శించుకోవడానికి మంగళవారం రాత్రి దిగువ అహోబిలం చేరుకుని స్థానిక మలోల అతిథి గృహంలో బస చేసిన గవర్నర్ దంపతులు.. బుధవారం వేకువజామునే దిగువ అహోబిలంలో కొలువైన శ్రీప్రహ్లాద వరదస్వామి దివ్యదర్శన పూజలో పాల్గొన్నారు.
అనంతరం ఎగువ అహోబిలం చేరుకుని.. శ్రీ జ్వాలా నారసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూజలు చేశారు. తర్వాత కాలినడకన వెళ్లి నల్లమలలో వెలసిన జ్వాలా క్షేత్రాన్ని సందర్శించారు. తిరిగి దిగువ అహోబిలం చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదల్లో భాగంగా తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
#
Tags