amp pages | Sakshi

ఎరువు సొమ్ము.. వడ్డీ మేత !

Published on Sat, 01/31/2015 - 09:21

విజయనగరం: సహకార సంఘాల్లో  బినామీ రుణాల సొమ్ము మాత్రమే కాదు,  ఎరువుల పైసలు కూడా పక్కదారి పడుతున్నాయి.  విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఎరువులు విక్రయించగా వచ్చిన రూ.కోటీ 50 లక్షలకు పైగా మొత్తం  అనధికారికంగా పీఏసీఎస్ పెద్దల చేతుల్లో చెలామణి అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ మొత్తాన్ని దర్జాగా సంఘాల పెద్దలు అనుభవిస్తున్నారు. సొమ్ము చెల్లించాలని అడుగుతున్న మార్క్‌ఫెడ్‌కు మాయమాటలు చెప్పి  కాలం గడిపేస్తున్నారు. డీసీసీబీ ఇచ్చిన గ్యారంటీ మేరకు విజయనగరం జిల్లాలోని సహకార సంఘాల(పీఏసీఎస్)కు  ప్రతీ ఏడాది మార్క్‌ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తోంది.


వీటిని విక్రయించి, ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయాలి.  పైసా పెట్టుబడి లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆ సంఘాలు కమీషన్ పొందుతాయి. దీనివల్ల  సిబ్బంది జీత భత్యాలు కొంతమేర గట్టెక్కుతాయి.  అలాగే, రైతులకు అందుబాటులోనే ఎరువుల్ని విక్రయంచినట్టు   అవుతుంది. ఇంత సదుద్దేశంతో సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్  ఎరువుల్ని సరఫరా చేస్తుంటే ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు జరగడం లేదు. విక్రయాలు జరిపి  నెలలు, ఏళ్లు గడుస్తున్నా మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమచేయకుండా కొన్ని సంఘాల్లో ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.

మరికొన్ని సంఘాల పెద్దలు వడ్డీలకిచ్చి లాభాలు పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఇదే తంతు నడుస్తోంది. కానీ, అధికారులు నియంత్రించలేకపోతున్నారు.   జిల్లాలో పలు పీఏసీఎస్‌లు గత ఏడాది రూ.2కోట్ల84లక్షల 52వేల మేర మార్క్‌ఫెడ్‌కు సంఘాలు బకాయి పడ్డాయి.  అలాగని ఆ మేరకు స్టాక్  ఎక్కడా లేదు. దాదాపు విక్రయాలు జరిగిపోయాయి. ఆ సొమ్ము దాదాపు  సంఘాల పెద్దల చేతుల్లోకి  వెళ్లిపోయింది. ఈ ఏడాది విషయానికి వస్తే సహకార సంఘాలకు రూ. 25.53 కోట్ల విలువైన ఎరువుల్ని మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది. గత ఏడాది బకాయితో కలిపి దాదాపు  రూ.28.38 కోట్ల మేర మార్క్‌ఫెడ్‌కు సహకార సంఘాలు చెల్లించాల్సి ఉంది.

ఇదే సందర్భంలో సహకార సంఘాల బినామీ రుణాల భాగోతం వెలుగు చూస్తుండడం, పలు సంఘాలపై ప్రాథమిక విచారణ, స్టాట్యూటరీ విచారణలు పడుతుండడంతో ఎరువులు సొమ్ము వాడుకుంటున్న సంఘాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సమయంలో ఎరువుల వ్యవహారం బయటపెడితే ఇబ్బందులొస్తాయని ఆ సంఘాల పెద్దలు చెల్లింపులు చేయడం వేగవంతం చేశారు.  ఈ క్రమంలో  గత సెప్టెంబర్ నాటికి రూ.4.40 కోట్లు  బకాయి ఉండగా, అక్టోబర్ నాటికి రూ.3.89 కోట్లకు, నవంబర్ నాటికి రూ.2.81కోట్లకు తగ్గింది.    కానీ, చివరిగా మిగిలిన రూ.2.49కోట్ల బకాయికి  సంబంధించిన వివరాలు అధికారుల వద్ద లేవు. విక్రయాలు జరిగినదెంత? స్టాక్ ఉన్నదెంత? అనేది ఎవరికీ తెలియదు. కానీ, సహకార శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం స్టాక్ విలువ రూ.కోటి లోపే ఉంటుందని తెలుస్తోంది.

అంటే దాదాపు రూ.కోటీ 50 లక్షలు వ్యక్తుల జేబుల్లోనే ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి.  బకాయిలున్న సంఘాల్లో ఇప్పటికే స్టాట్యూటరీ విచారణ జరుగుతున్న రావివలస, చెముడు సొసైటీలున్నాయి. వాటితో పాటు విక్రయాలు జరిపి మార్క్‌ఫెడ్‌కు సొమ్ము చేయని సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా  మార్క్‌ఫెడ్ అధికారులు  ఏం చేయలేకపోతున్నారు. దీనికి పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది.  ఆ శాఖలో నలుగురే ఉద్యోగులుండటం, వారిలో ఇద్దరు కార్యాలయానికి  పరిమితం కావలసి వస్తుండగా,  మరొకరు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంకొకరు డివిజనల్ మేనేజర్‌గా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించవలసి ఉంది.  

దీన్నిబట్టి మార్క్‌ఫెడ్ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సంఘాలకు సరఫరా చేసిన ఎరువుల్లో ఎంత  స్టాక్‌ను విక్రయించారు ? ఎంత స్టాక్ ఉంది? అన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీనికోసం  తనిఖీలు జరపాలి. విక్రయాలు జరిగిన మేరకు మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లాలో అటువంటి పర్యవేక్షణ, తనిఖీలు జరగకపోవడంతో ఎక్కడేం జరుగుతుందో? ఎక్కడెంత విక్రయాలు జరిగాయో? ఎక్కడెంత స్టాక్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంఘాల సిబ్బంది చెప్పే  వివరాలు, లెక్కల్నే మార్క్‌ఫెడ్ సిబ్బంది పరిగణలోకి తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పలు సంఘాల్లో విక్రయాలు చేపట్టినా... ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయడం లేదు. సదరు మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. వడ్డీలకు తిప్పుకుని లబ్ధిపొందుతున్నారు. కొందరికి ఇదొక టర్నోవర్‌గా తయారైంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)