amp pages | Sakshi

ఫిషరీస్‌ అసిస్టెంట్‌ 19 పోస్టులకుగాను 12 మంది ఎంపిక

Published on Tue, 09/24/2019 - 09:08

సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు షిఫరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధువ్రీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. జిల్లాలో 19 పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా.. 834 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షల్లో 65 మంది అర్హత సాధింంచారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్‌ ఆఫ్‌ రోస్టర్‌లో 12 మంది అభ్యర్థులు మెరిట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ధ్రువీకరణ పత్రాలను జేసీ–2 సుబ్బరాజు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, మత్య్స శాఖ డీడీ హీరా నాయక్‌ పర్యవేక్షణలో అధికారులు పరిశీలన చేశారు. భర్తీ కావాల్సిన మరో ఏడు పోస్టులకు సంబంధించి రెండో జాబితా విడుదల చేస్తారా? లేదా మరో నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారా తేలాల్సి ఉంది. కాగా, సాంకేతిక సమస్యల వల్ల సర్టిఫికెట్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది.
 
సమాచారం ఉన్న వారికే అనుమతి 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు సంబంధిత శాఖల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఈ–మెయిల్‌ అందుకున్న వారు మాత్రమే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థి ఏ సెంటర్‌కు హాజరు కావాలి, ఎన్ని గంటలకు అనే సమాచారం వారి మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ చేశారు. దీని ఆధారంగా అభ్యర్థులు తాము ఆన్‌లైన్‌లో ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకళ్లను తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది.  

నేడు పరిశీలన జరిగే అవకాశమున్న శాఖలు 
మంగళవారం హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్, అనిమల్‌ అస్బెండరీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.   

అభ్యర్థులు ఆందోళన చెందవద్దు 
గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన విషయంగా ఆందోళన పడరాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన నిర్వహించాం. అలాగే ఇతర శాఖల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, మెయిల్‌ ద్వారా సమాచారం అందజేశాం. సమాచారం అందుకున్న వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలోఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వదంతులు నమ్మరాదని అభ్యర్థులకు సూచిస్తున్నాం.    
– శోభాస్వరూపరాణి, సీఈఓ, జిల్లా పరిషత్‌  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌