amp pages | Sakshi

ఉత్సాహంగా..రేస్‌

Published on Sun, 11/18/2018 - 08:36

సాక్షి,విజయవాడ : ప్రతిష్టాత్మకమైన ఎస్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటు రేసింగ్‌కు రెండవ రోజు ఉత్సాహంగా సాగింది. రేసింగ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. శనివారం జరిగిన కాలిఫైయింగ్‌ తొలిరౌండ్‌లో 19 జట్లు పాల్గొనగా అందులో 12 జట్లు అర్హత సాధించాయి. రెండవ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ పూర్తయిన తరువాత 6 జట్లు అర్హత సాధించాయి. ఇందులో అమరావతి బోటు కూడా అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు. 

నదుల్లో బోటింగ్‌ కొంత ఇబ్బందే
సముద్రంలో జరిగే ఈ రేస్‌లు నదిలో నిర్వహించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రేసర్లను విలేకర్లు ప్రశ్నించినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉందని వారు చెప్పారు. ముఖ్యంగా నదిపై వచ్చే గాలి వల్ల, నీటి ప్రవాహం వల్ల బోట్లు నడపడం కొంచెం ఇబ్బందిగా ఉంటోదని పేర్కొన్నారు. చాకచక్యంగా, వేగవంతంగా నడుపుతున్నామని రేసర్లు చెబుతున్నారు. 

ప్రజాప్రతినిధుల చేతుల్లో పాస్‌లు
వీవీఐపీ పాన్‌లను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ పాస్‌లన్నీ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతికి, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల చేతికి వెళ్లిపోయాయి. బోట్‌ రేసింగ్‌ పై ఆసక్తితో తిలకించడానికి వచ్చే వారికి పాస్‌లు లేకపోవడంతో దుర్గాఘాట్‌లోనూ, భవానీఘాట్‌లోనూ కూర్చుని తిలకించాల్సి వచ్చింది. పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులను పెద్దఎత్తున తరలించారు. ఉదయం వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు కూర్చోలేక రేస్‌ ప్రారంభం కాకముందే వెళ్లిపోవడం దర్శనమిచ్చింది.

సౌకర్యాలు నిల్‌
పున్నమి ఘాట్‌కు వచ్చిన సందర్శకులకు కావాల్సిన ఏర్పాటు చేయడంలో నిర్వహకులు పూర్తిగా విఫలమయ్యారు. మంగళగిరి చెందిన కొంతమంది యువతులు గ్యాలరీ 5కు చెందిన పాస్‌లు తీసుకువస్తే ఆ గ్యాలరీ ఎక్కడో చెప్పేవారే కరువయ్యారు. చివరకు రెండవ నెంబర్‌ గ్యాలరీ ఖాళీగా వుందని తెలుసుకుని అక్కడకు వెళ్లి కూర్చుని రేస్‌లను తిలకించారు. ఏ గ్యాలరీ ఎక్కడ ఉందో అధికారులే చెప్పలేకపోతున్నారని ప్రజ్ఞ సాక్షికి వివరించింది. రేస్‌ల గురించి సమాచారం చెప్పేవారే కరువయ్యారు. 

ఆఖరి రోజుపైనే అందరి దృష్టి
రెండవ రోజు తగినంత మంది సందర్శకులు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం అదే పరిస్థితి ఉంటే ప్రతిష్ట దెబ్బతింటుందని భారీగా ప్రేక్షకుల్ని తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పవిత్ర సంగమం వద్దకు రేస్‌లు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చెప్పింది. వాస్తవంగా భవానీఘాట్‌ వరకు మాత్రమే బోట్లు నడుస్తున్నాయి. పవిత్ర సంగమం వద్దకు వచ్చిన వారు రేస్‌లు సరిగా కనపడటం లేదని చెప్పారు. 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)