amp pages | Sakshi

రీ’ చార్జ్‌తో రయ్‌..రయ్‌..

Published on Tue, 09/25/2018 - 13:20

కడప అగ్రికల్చర్‌: వాహనంలో పెట్రోలు అయిపోయిందన్న బెంగ ఇక ఉండదు. వాహనదారులు టెన్షన్‌ పడాల్సిన పని అసలే ఉండదు..పెట్రోలు, డీజిల్‌ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రికల్‌ బ్యాటరీతో నడిచే వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా బ్యాటరీతో నడిచే వాహనాలకు రీచార్జ్‌ చేయిం చుకునే కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఇక నుంచి వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని విద్యుత్‌ అధికారులు అంటున్నారు. జిల్లాకు ఎలక్ట్రికల్‌ రీచార్జ్‌ స్టేషన్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని ఏర్పాటు చేయిం చేందుకు అధికారులు జిల్లా కేంద్రంలో సన్నాహాలు ప్రారంభించారు. ఈ స్టేషన్ల నిర్మాణాలను వచ్చే జనవరి లోపల పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌లకు ఏ విధంగా చార్జింగ్‌ చేస్తామో ఆ తరహాలో ఈ ఎలక్ట్రికల్‌ వాహనాలకు కూడా రీచార్జ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం స్థలాలను గుర్తించి ఇస్తే నిర్వాహకులు సే ్టషన్లను ఏర్పాటు చేస్తామని ఒప్పందం కు దుర్చుకున్నారు. విద్యుత్‌శాఖ అధికారులుఆయా స్టేషన్లకు సరఫరాను ఇస్తారు. స్టేషన్ల ఏర్పాటు నుంచి బిల్లును నిర్వాహకుల నుంచి వసూలు చేస్తారు.

కడప నగరంలో ఏడు ఎలక్ట్రికల్‌ రీచార్జ్‌ స్టేషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలను ఎనర్జీ ఎపిషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ వారు  చేపట్టనున్నారు. స్థలాలను విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉండడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఒకసారి పరిశీలించి అనుమతులు ఇచ్చేలా నోట్‌ ఫైల్‌ తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ స్టేషన్లలో వాహనానికి ఒక గంట చార్జింగ్‌ చేస్తే 20 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. కారుకు ఐదు గంటలు చార్జింగ్‌ చేస్తే 120కిలో మీటర్లు సరిపోతుందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. గంట చార్జింగ్‌ చేస్తే  నిర్వహకులు రూ.3 వసూలు చేస్తారు. ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.3 నుంచి 5 లక్షలు పెట్టుబడి అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. 

కడప నగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. మొదట ప్రభుత్వ ఉన్నతాధికారు వాహనాలన్నీంటికి ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను అమర్చి వాటికి చార్జింగ్‌ ఇచ్చి నడుపుతారు. ఆ తరువాత ఇతర అధికారుల వాహనాలకు ఈ బ్యాటరీలు అమర్చుకునే అవకాశం కల్పిస్తారు.

కడప నగరంలో ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే
కడప నగరంలో పాత కలెక్టరేట్‌లోను, పాత మున్సిపల్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణల్లోనూ, పోలీసు పెట్రోల్‌ బంక్‌ కో ఆపరేటివ్‌ కాలనీ, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఐటీఐ సర్కిల్, కొత్త కలెక్టరేట్, మార్కెట్‌యార్డు దేవుని కడపరోడ్డులో ఈ రీచార్జ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లను ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ వారు నిర్వహిస్తారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)