amp pages | Sakshi

బంగారు తల్లీ ఎక్కడమ్మా..!

Published on Thu, 03/05/2015 - 01:31

ప్రొద్దుటూరు టౌన్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వకపోవడంతో ఈ పథకం అమలు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎంతో ఆర్భాటంగా గతంలో అధికారంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతలో ఆడ పిల్ల పేరున రూ.2,500 ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేసింది. తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో 2013 మే 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలకు బంగారుతల్లి పథకం వర్తిస్తుందని, ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండేలోపు ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు వారి చదువులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది.
 
 బిడ్డ పుట్టగానే రూ.2,500, మొదటి, రెండో ఏడాదిల్లో రూ.1000 చొప్పున, 3-5 ఏళ్ల వరకు రూ.1500 చొప్పున, 6-10 ఏళ్ల వరకు రూ.2వేలు చొప్పున, 11-12 సంవత్సరాల వరకు రూ.2,500 చొప్పున, 13వ సంవత్సరం రూ.2,500, 14-15 సంవత్సరం రూ.3వేలు, 16-17 సంవత్సరాలకు రూ.3,500, 18-21 సంవత్సరాల వరకు రూ.4వేలు చొప్పున, ఇంటర్ పూర్తి చేశాక రూ.50వేలు, డిగ్రీ పూర్తి చేశాక రూ.లక్ష వారి ఖాతాల్లో జమ చేసే విధంగా పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా ఆడ పిల్లల భ్రూణ హత్యల నివారణతోపాటు ఆడ పిల్లల సంరక్షణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నదే లక్ష్యం.
 
 జిల్లా వ్యాప్తంగా బంగారు తల్లి నమోదు, మొదటి విడత జమలు ఇలా
 జిల్లా కేంద్రమైన కడపలో 998 మంది దరఖాస్తు చేసుకోగా 953 మందికి అర్హత లభించింది. కేవలం 62 మందికి మాత్రమే రూ.లక్షా 55వేలు మొదటి విడత ఖాతాల్లో జమ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 685 మంది దరఖాస్తు చేసుకోగా 633 మంది అర్హత పొందారు. వీరిలో 238 మందికి మొదటి విడత రూ.5.95 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ అయింది. బద్వేలు మున్సిపాలిటీలో 367 మంది దరఖాస్తు చేసుకోగా 344 మంది అర్హత పొందారు. వీరిలో 28 మందికి మాత్రమే రూ.70వేలు జమ చేశారు. అలాగే జమ్మలమడుగు మున్సిపాలిటీలో 223 దరఖాస్తు చేసుకోగా 210 మంది అర్హత సాధించారు. వీరిలో 26 మందికి రూ.65వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో 232 మందికి 213 మంది అర్హత సాధంచగా కేవలం 12 మందికి రూ.30వేలు వారి ఖాతాల్లో వేశారు. పులివెందుల మున్సిపాలిటీలో 356 మందికి 332 మంది అర్హత సాధించగా వీరిలో 60 మందికి రూ.1.50లక్షలు వారి ఖాతాల్లో జమ అయింది. రాజంపేట మున్సిపాలిటీలో 109 మందికి 101 మంది అర్హత సాధించగా 15 మందికి రూ.37,500 వారి ఖాతాల్లో వేశారు. రాయచోటి మున్సిపాలిటీలో 172 మందికిగాను 164 మంది అర్హత సాధించగా 67 మందికి రూ.1,67,500 ఖాతాల్లో జమ అయింది.
 
 ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 192 మందికిగాను 169 మంది అర్హత సాధించగా 35 మందికి రూ.87,500 వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3334 మంది దరఖాస్తు చేసుకోగా 3199 మంది అర్హత సాధించారు. వీరిలో 543 మందికి మాత్రమే మొదటి విడత రూ.13 లక్షల 59 వేల 500 లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకం గురించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)