amp pages | Sakshi

అవినీతి ఆట

Published on Fri, 04/28/2017 - 09:29

► పీఈటీల ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు కోకొల్లలు
► చక్రం తిప్పుతున్న డీఈవో కార్యాలయ సిబ్బంది
► గందరగోళంగా సీనియారిటీ జాబితా
► కలెక్టర్‌గారూ.. స్పందించాలి మీరు

అన్ని శాఖలకు ఆదర్శంగా నిలవాల్సిన విద్యాశాఖాధికారులు అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉద్యోగోన్నతులు వచ్చినప్పుడే కాసులు  కొల్లగొట్టాలని ప్రణాళిక రచించుకున్నారు. దానికి పీఈటీల సీనియారిటీ జాబితాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ముడుపులిచ్చే వారిని అందలం ఎక్కిస్తూ మిగిలిన వారిని పక్కకు నెట్టేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ఆగడాలకు తమ జీవితాలే సర్వనాశనమవు తున్నాయని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు.

సాక్షి, చిత్తూరు: జిల్లాలో సీనియర్‌ పీఈటీలకు ఉద్యోగోన్నతుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పలుకబడి, ముడుపులు సమర్పించుకున్న వారినే అందలం ఎక్కిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని పలువురు పీఈటీలు విద్యాశాఖ చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ప్రస్తుత ఉద్యోగోన్నతుల్లో తమకు అన్యాయం జరిగితే భవిష్యత్‌లో నష్టపోయి పీఈటీ పోస్టులకే పరిమితం కావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర విభజన కాకముందు2000 డీఎస్సీలో ఎంపికైన నాన్‌ లోకల్‌ పీఈటీల వ్యవహారం ప్రస్తుతం అమలులో లేనప్పటికీ దాదాపు 80 మంది సీనియర్‌ పీఈటీల పేర్లను ఉద్యోగోన్నతుల జాబితాలో చేర్చలేదు. ఇదే డీఎస్సీకి చెందిన వారికి పలు జిల్లాల్లో ఉద్యోగోన్నతులు కల్పించారని, కానీ తమకు అలాంటి అవకాశం కల్పించడంలేదని చెబుతున్నారు. తమకంటే వెనుక డీఎస్సీ చేసిన వారికి సైతం  జాబితాలో అవకాశం కల్పించారని ఆరోపిస్తున్నారు.

జాబితా తారుమారు
నెల రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పీఈటీల ఉద్యోగోన్నతుల వ్యవహారం సాగుతోంది. ఇందుకు అర్హులైన వారి నుంచి సర్వీసు రిజిష్టర్, దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్న సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు అర్హులైన పీఈటీల  వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను తయారుచేశారు. ఆ జాబితాను విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఓ అధికారి తారుమారు చేశారని  సమాచారం. డీఈవో సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఒక్క రోజు కూడా అలా జరగకపోవడం వల్లే  అవకతవకలు జరిగాయని ఉపాధ్యాయ సంఘ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను విడుదల చేసి, అందులో అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకోవాలని సూచించడంతో బాధితులు వివరాలు సమర్పించారు. గత నెలలో డీఈవో కార్యాలయంలో జరిగిన అభ్యంతరాల స్వీకరణకు వందల మంది పీఈటీలు క్యూ కట్టారు.  ఇక్కడా న్యాయం జరగకపోవడంతో అమరావతి కెళ్లి విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. కానీ స్పందన లేదు.

ముడుపులే కారణం
పలు శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖ లోనే భారీ అవకతవకలు జరుగుతున్నాయంటే.... దాని కి ప్రధాన కారణం ముడుపుల వ్యవహరమేనన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితాను తయారు చేసి లక్షల సొమ్ము పోగేసుకుంటున్నట్టు బాధిత పీఈటీలు ఆరోపిస్తున్నారు.

ఇవే ఆధారం
2000 డీఎస్సీలో ఎంపికైన ఓ ఉపాధ్యాయుని మెరిట్‌లో 34వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. మరొకరు 110వ స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ముందుకు వచ్చేశారు. స్పౌస్‌ జాబితా అంటూ ఓ ఉపాధ్యాయుడి పేరును జాబితాలో చేర్చితే ఇదే∙నిబంధన ఉన్న ఓ పీఈటీ ఉపాధ్యాయురాలిని జాబితా నుంచి తొలగించారు. ఇవే కాదు ఇలా ఎన్నో అవకతవకలు.. కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ న్యాయం చేయాలి
జిల్లాలోని పదోన్నతుల వ్యవహారంలో చాలా మంది పీఈటీలకు అన్యాయం జరిగింది. రోస్టర్, మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయాల్సి ఉండగా, ఇక్కడి విద్యాశాఖ సిబ్బంది పూర్తి విరుద్ధంగా జాబితాను సిద్ధం చేశారు. గతంలో ఒక విధానం, ప్రస్తుత పదోన్నతుల్లో మరొక విధానం పాటించడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. – రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకుడు

ప్రత్యేక బృందంతో పరిశీలించాలి
పలువురు పీఈటీలకు అన్యాయం జరిగిందని తమకు ఇటీవలే తెలిసింది. ఈ విషయంపై తమ ఆపస్‌ సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశాం. ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంలో ప్రత్యేక బృందంతో పీఈటీల సీనియారిటీ జాబితాను మరోసారి పరిశీలించాలి. – బాలాజీ, ఉపాధ్యాయ సంఘం నేత

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)