amp pages | Sakshi

ఎంసెట్‌పై రగడ

Published on Tue, 01/20/2015 - 00:38

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఎంసెట్‌ను తమ రాష్ట్రానికి వేరుగా నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎంసెట్ సహా వివిధ సెట్లను ఉమ్మడిగా నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంతకుముందే  షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 10న ఎంసెట్ నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు కూడా చేపట్టింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఎంసెట్‌ను విడిగా నిర్వహించుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ను విడుదల చేయించింది.

మే 14న తెలంగాణ ఎంసెట్ జరుగుతుందని, హైదరాబాద్ సహా తెలంగాణ కాలేజీల్లో చేరదల్చుకున్న ఏపీ విద్యార్థులు తమ ఎంసెట్‌ను కూడా రాయాలని స్పష్టం చేసింది. తెలంగాణ షెడ్యూల్ ప్రకటనను తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ నరసింహ న్‌కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ  షెడ్యూల్ విడుదలైన వెంటనే ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంటా, వేణుగోపాలరెడ్డిలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని, ఒంటెత్తు పోకడలతో వెళ్తోందని ఫిర్యాదు చేశారు. విభజన చట్టం మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల బాధ్యత ఏపీ ఉన్నత విద్యా మండలిదేనని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని చెప్పారు.

ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ఉన్నత విద్యామండలికి పంపిన లేఖను మంత్రి గంటా గవర్నర్‌కు చూపించారు. ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను నిలిపేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి రాసిన లేఖకు స్పందనగా ఆంధ్రాబ్యాంకు న్యాయసలహాలు తీసుకొని ఈ లేఖను పంపించిందన్నారు. దీని ప్రకారం చూసినా ఉమ్మడి పరీక్షలపై ఏపీ ఉన్నత విద్యామండలికే సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని అన్నారు.

వేర్వేరుగా సెట్లు నిర్వహిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులూ రెండేసి ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుందని తెలిపారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇరువురు సమన్వయంతో ఏకాభిప్రాయానికి వచ్చి పరీక్షల నిర్వహణను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పినట్లు సమాచారం.
 
గవర్నర్  సూచనల్ని అంగీకరించాలి: గంటా


ఉమ్మడి ఎంసెట్‌పై గవర్నర్ నరసింహన్ గతంలో మూడు ప్రతిపాదనలు చేశారని, వాటిలో తెలంగాణ ప్రభుత్వం దేనికి అంగీకరించినా ఆ ప్రకారం నడుచుకోవడానికి తాము సిద్ధమేనని ఏపీ మంత్రి గంటా తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతినిధి చైర్మన్‌గా, ఏపీ ప్రతినిధి వైస్ చైర్మన్‌గా ఉమ్మడి ఎంసెట్‌కైనా తమకు అభ్యంతరం లేదన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ తీరుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. తమ ఖాతాలను స్తంభింపచేయాలని తెలంగాణ మండలి బ్యాంకులకు లేఖలు రాయడం దారుణమన్నారు.టి.ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు విడిగా షెడ్యూల్‌ను ప్రకటించడంతో దానిపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)