amp pages | Sakshi

లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు

Published on Wed, 07/23/2014 - 03:41

మాకవరపాలెం : జిల్లాలో లక్షా ్యన్ని మించి రూ.443 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందజేశామని డీర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. రూ.380 కోట్లు లక్ష ్యంకాగా రూ.443కోట్లు అందజేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 38 వేల డ్వాక్రా సంఘాలకు 1999 నుంచి ఇప్పటి వరకు రూ.1600 కోట్లు రుణాలిచ్చామన్నారు. ప్రస్తుతం వీరంతా రూ. 593కోట్లు బ్యాంకులకు చెల్లించాలన్నారు.
 
వీటిలో మొండి బకాయిలు రూ.16 కోట్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 3.19లక్షల మందికి పింఛన్లుగా ప్రతి నెలా రూ.8కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆధార్ సీడింగ్ 1.08లక్షల మంది పెన్షన్‌దారులకు పూర్తయిందన్నారు. బయోమెట్రిక్‌లో భాగంగా ఇంకా 46వేల మంది నుంచి వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. వేలి ముద్రలు పడని వారుంటే వారి బంధువుల వేలి ముద్రలు ఇవ్వవచ్చన్నారు.
 
నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చనిపోయిన 3450మంది పింఛనుదారుల పేర్లను తొలగించామన్నారు. బోగస్ పింఛన్లను తొలగించేందుకు ఆధార్ సీడింగ్ చేపడుతున్నామన్నారు. కొత్తగా 29,600 మంది పింఛన్ల కోసం దరఖాస్తు  చేసుకున్నారని వివరించా రు. డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలయిన 54వేల మంది విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 1200చొప్పున  ఏటా రూ.5.66కోట్లు అందజేస్తున్నామన్నారు.
 
జనశ్రీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తం గా లక్ష మంది ఎస్సీ,ఎస్టీలను ఈ పథకంలో చేర్చడమే లక్ష ్యమన్నారు. ఒక్కొక్కరు రూ.15 చెల్లించి ఈ బీమా పథకంలో చేరితే సాధారణ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.75వేలు అందుతుందన్నారు. వచ్చేనెల 16నుంచి 23వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యంలో బీమా వారోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ష్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తామన్నారు.  కార్యక్రమంలో ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగం ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
బైక్ ఎక్కిన పీడీ

గొలుగొండ : డ్వాక్రా మహిళలు సమావేశమై పొదుపు, బకాయిలు తీర్చేపద్ధతులపై చర్చించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేటలో మంగళవారం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.  ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలున్నాయి? ఎంత మేర రుణం తీర్చారు? తదితర విషయాలు తెలుసుకున్నారు. విధిగా వారానికి ఒకసారి సమావేశం కావాలన్నారు. మద్యపాన నిషేధంపై కూడా చర్చించుకోవాలన్నారు. ఉపాధి హామీలో కూరగాయల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం మండలంలో మారుమూల డొంకాడ వెళ్లి, అక్కడి ఐకేపీ బాలబడి కేంద్రాన్ని పరిశీలించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు ద్విచక్ర వాహనం, మరో రెండు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులు తాగునీరు, విద్యుత్, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీని కోరారు.  కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, బాలబడుల జిల్లా ఇన్‌చార్జి గోవిందరావు, డివిజన్ ఇన్‌చార్జి కొండలరావు,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌