amp pages | Sakshi

చూశారనే చంపేశాడు

Published on Fri, 04/25/2014 - 03:05

అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మడకశిరలో ఈ నెల మూడో తేదీన సంచలనం రేకెత్తించిన చిన్నారుల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు నరసింహప్పను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.74 వేలు విలువ చేసే 26 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చిన్నారులకు స్వయానా బంధువు కావడం గమనార్హం. తాను దొంగతనం చేస్తుండగా చిన్నారులు చూశారనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు.
 
 మడకశిరలోని తలారి వీధిలో టీచర్ ఆనందప్ప కుటుంబం నివాసం ఉంటోంది. ఆనందప్పకు బంధువైన నీలకంఠాపురానికి చెందిన ఎన్.నరసింహప్ప తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. వివాహితుడైన ఇతడికి కర్ణాటక రాష్ర్టం పావగడ తాలూకాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ఆర్థిక అవసరాల కోసం ప్రియురాలి ఆభరణాలను ఓ నగల దుకాణంలో తాకట్టుపెట్టాడు. అయితే ఇటీవల కాలంలో నగలు విడిపించాలని ఆమె నుంచి ఒత్తిడి పెరిగింది. ఏమి చేయాలో పాలుపోని నరసింహప్ప దొంగత నమే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ నెల మూడో తేదీన టీచర్ దంపతులు ఆనందప్ప, సాకమ్మ స్కూలుకు వెళ్లాక వీరి ఇంటికి వచ్చాడు.
 
 పిల్లలు మంజువాణి (13), రంగనాథ్ (8)లు ఇంటికి గడియ పెట్టి సమీపంలోని దుకాణానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నరసింహప్ప సరిగ్గా 11.30 గంటల సమయంలో ఆ ఇంట్లోకి ప్రవే శించాడు. అందుబాటులో ఉన్న తాళాలతో బీరువా తెరిచి రూ.74 వేలు విలువ చేసే బంగారు గొలుసు, డాలర్, ఉంగరం జేబులో వేసుకున్నాడు. ఇంతలో రంగనాథ్ ఇంట్లోకి వచ్చి చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను గమనించాడు. అక్కడే ఉన్న నరసింహప్ప.. ఆ బాలుడు తన గుట్టు ఎక్కడ విప్పుతాడోనని టవల్‌తో గొంతు బిగించి చంపేశాడు. కాసేపటి తర్వాత తమ్ముడిని పిలుస్తూ బయటి నుంచి మంజువాణి లోపలికి వచ్చింది.
 
 ఆ బాలిక ను కూడా నిర్దాక్షిణ్యంగా చున్నీతో గొంతు బిగించి హతమార్చి.. చోరీ చేసిన సొమ్ముతో ఉడాయించాడు. అభం శుభం తెలియని చిన్నారుల హత్య సంచలనం రేపింది. వారం వరకు చిన్న క్లూ కూడా లభించక పోవడంతో పోలీసుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసును ఎస్పీ సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయించారు. అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, హరినాథ్, ఎస్‌ఐలు ధరణి కిశోర్, సద్గురుడు, ఆంజనేయులు, ఏఎస్‌ఐ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. బుధవారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మడకశిర కోర్టులో హాజరు పరిచారు. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో నిందితున్ని హిందూపురం సబ్‌జైలుకు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)