amp pages | Sakshi

బీఈడీలకునిరాశే

Published on Fri, 11/21/2014 - 01:32

ఒంగోలు వన్‌టౌన్: సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీ విషయంలో బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచేయి చూపారు. దీంతో జిల్లాలో 10వేల మందికి పైగా బీఈడీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఈడీ/టి.టి.సి. విద్యార్హతలున్న వారిని అర్హులుగా గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన గత రెండు డీఎస్సీలో సెకండరీ గ్రేడు పోస్టులను కేవలం డి.ఇ.డి. అభ్యర్థులకే కేటాయించారు.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండరీ గ్రేడు పోస్టులకు అర్హులుగా ప్రకటిస్తామని ఎస్.జి.టి.పోస్టుల్లో బీఈడీలను నియమిస్తామని వాగ్ధానం చేశారు. బీఈడీలకు ఎస్.జి.టి. పోస్టులకు అనుమతించాలని కోరుతూ ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ’(ఎన్‌సిటిఇ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

అయితే ఎస్‌జిటి పోస్టులకు డీఈడీలను మాత్రమే అనుమతించాలని బీఈడీలను అనుమతించరాదని కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలందాయి. దీంతో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సెకండరీ గ్రేడు పోస్టులకు డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ప్రకటించింది. దీంతో అర్హత లభిస్తుందని గంపెడాశతో ఎదురుచూసిన బీఈడీలకు తీవ్ర నిరాశే మిగిలింది.

 839 పోస్టులు మాత్రమే భర్తీ
  జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఎట్టకేలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి గత మూడు నెలలుగా రకరకాల ప్రకటనలతో నిరుద్యోగ టీచర్లను అయోమయానికి గురిచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భర్తీ సంఖ్యను గణనీయంగా తగ్గించింది. జిల్లాలో కేవలం 839 టీచర్ పోస్టులను మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండింటినీ కలిసి ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన నిరుద్యోగ ఉపాధ్యాయులు తాజా నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయ పోస్టుల పరీక్షతోపాటు టెట్ పరీక్ష కూడా మళ్ళీ రాయాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలోనే కాలహరణం చేసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేనట్లే. తాజాగా జారీ చేయనున్న  నోటిఫికేషన్‌లో ఎంపికయ్యే ఉపాధ్యాయులకు 2015-16 విద్యాసంవత్సరంలోనే నియామకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

 అర్హత మార్కులివే...
 ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహించే డీఎస్సీ, టెట్ ఉమ్మడి రాతపరీక్షలో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎస్‌జిటి, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉద్యోగ నియమకాలకు ఓసీ అభ్యర్థులకు కనీసం 60 శాతానిపైగా, బీసీలకు 50 శాతంపైగా, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతంపైగా మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే ఉద్యోగాల అర్హులుగా పరిగణించి ఎలిజిబులిటీ సర్టిఫికేట్లు జారీ చేస్తారు.

 జిల్లాలో 839 పోస్టులు
 తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో మొత్తం 839 పోస్టులను ప్రకటించనున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)