amp pages | Sakshi

పడగ విప్పుతున్న డెంగీ!

Published on Fri, 12/07/2018 - 13:35

కర్నూలు(హాస్పిటల్‌): జ్వరమా..ఒళ్లునొప్పులా..కళ్లు ఎర్రగా మారాయా..తీవ్రంగా తలనొప్పి వస్తోందా? అయితే డెంగీ జ్వరం కావచ్చు అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగా డెంగీ పరీక్ష చేస్తున్నారు. కొందరు అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. ఈ రక్తకణాలకు డబ్బులు కట్టలేక రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరు లో ఏరియా ఆసుపత్రులు, 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 700లకు పైగా నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. నెలరోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో వైరల్‌ ఫీవర్లు అధికమయ్యాయి. ఇందులో మలేరియా, డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో డెంగీ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్‌ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీగా నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే వెంటనే రక్తం, ప్లేట్‌లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తోంది. సగటున ప్రతి ఆసుపత్రిలో ఒకరు డెంగీ లక్షణాలతో బాధపడుతున్న రోగులు ఉన్నారు.  

జిల్లాలో 208 మందికి డెంగీ లక్షణాలు
జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 208 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఇందులో వ్యాధి నిర్ధారణ అయింది 9 మందికి మాత్రమే అని వారు చెబుతున్నారు. వాస్తవంగా డెంగీ బాధితుల సంఖ్య దీనికి రెట్టింపుగానే ఉంటోందని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు స్పష్టం చేస్తున్నారు. డెంగీ వ్యాధి ఉందని చెబితే అధికారుల నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఈ కారణంగానే ఆసుపత్రిలోనే వైద్యం చేసి పంపిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.   రెండు నెలల నుంచి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లేట్‌లెట్లు(ఎస్‌డీపీ) తీసుకున్న వారు 15 మంది, పీఆర్‌పీ తీసుకున్న వారు 45 మందికి పైగా ఉండగా, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు పది మంది చొప్పున ఎస్‌డీపీ, 40 మంది దాకా పీఆర్‌పీ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే స్థాయిలో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లోనూ రక్తకణాల కోసం ప్రజలు వెళ్తున్నారు.  

పారిశుద్ధ్యలోపం..
కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పేరుతో కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవి ఉపయోగపడటం లేదు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి.. దోమలు విజృంభిస్తున్నాయి. వీటి నిర్మూలనకు ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డెంగీ వ్యాధి ఇలా సోకుతుంది..
శరీరంపై తెల్లటి చారలు ఉండే ఏడిస్‌ ఈజైప్టె అనే దోమకాటు కారణంగా డెంగీ వస్తుంది. ఈ దోమ   పగలు మాత్రమే కుడుతుంది. ఇది నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. రెండు వారాలు మాత్రమే జీవించే ఇది మూడుసార్లు వంద గుడ్ల చొప్పున పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టెన్స్‌ వెనుక దాక్కుంటాయి.  

వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు
డెంగీ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న ఇంటి పరిసరాల్లోని 50 ఇళ్లలో లార్వా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నాం. గత జులై నుంచి నవంబర్‌ వరకు మొబైల్‌ మలేరియా, డెంగీ వాహనాల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో డీడీటీ స్ప్రే చేయించాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశించాం.–డేవిడ్‌రాజు, మలేరియా నియంత్రణాధికారి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)