amp pages | Sakshi

ఆ ఉత్తర్వులను రద్దు చేయండి

Published on Tue, 07/16/2019 - 08:02

సాక్షి, అమరావతి : కృష్ణానది కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్‌ పేరుతో నిర్మించిన కట్టడం కూల్చివేత నిమిత్తం తాము జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సీఆర్‌డీఏ కమిషనర్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ‘ఏదైనా వ్యవహారంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే దాఖలు చేసే వ్యాజ్యాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. నోటీసులు జారీ చేసిన అభ్యంతరాలు ఆహ్వానించిన దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పిటిషనర్‌ సీఆర్‌డీఏ చట్ట ప్రకారం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత పరిధిలో నిర్మించిన కట్టడం న్యాయ సమ్మతమైందని పిటిషనర్‌ చూపలేకపోయారు.

రాజధాని ప్రాంత పరిధిలో అభివద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్‌డీఏకు అన్నీ అధికారాలున్నాయి. నదికి 100 మీటర్లలోపు నిర్మాణాలు చేపట్టడంపై స్పష్టమైన నిషేధం ఉంది. 2007లో ఈ మేర జీవో కూడా జారీ అయింది. పిటిషనర్‌ ఏ కట్టడం గురించి అయితే చెబుతున్నారో, ఆ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి నిర్మించిన అక్రమ కట్టడాలకు క్రమబద్ధీకరణను సాకుగా చూపడం తగదు. ఈ విషయాలన్నింటినీ సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది.   ఏ కోణంలో చూసినా కూడా సింగిల్‌ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధం. అందువల్ల వాటిని రద్దు చేయండి.’ అని సీఆర్‌డీఏ కమిషనర్‌ తన అప్పీల్‌లో పేర్కొన్నారు. ఈ అప్పీల్‌ గురించి అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సోమవారం ఉదయం ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. రైతు సంఘం భవనం పేరుతో నిర్మించిన తమ కట్టడాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ, దానిని తొలగించే నిమిత్తం సీఆర్‌డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత వారం విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, సీఆర్‌డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)