amp pages | Sakshi

గొంతు నొక్కేస్తున్నారు

Published on Sun, 08/26/2018 - 12:41

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశ్నించే వారి గొంతు నొక్కేదిశగా ప్రభుత్వం నడుస్తోంది. బాధితులకు సాయం అందలేదని తహసీల్దార్‌ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది.  రెండురోజుల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశాలు, జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఒత్తిడి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తప్పుడు కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమించడానికి పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు.

ప్రశ్నిస్తే.. కేసులా..!
ఎర్రకాలువ వరద కారణంగా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో పలు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. నందమూరు చుట్టూ వరదనీరు వచ్చి చేరడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పునరావాస కేంద్రాలకు వెళ్లగా, ఇంటికి కాపలాగా మరికొందరు గ్రామాల్లోనే ఉన్నారు. పునరావాస శిబిరాలకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నవారికి ఆహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. వీరంతా భోజనం,అల్పాహారం కోసం నందమూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కృష్ణాయపాలెం శిబిరానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతా చేసి అక్కడికి వెళ్లినా పూర్తిస్థాయిలో భోజనం అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ బృం దం ట్రాక్టర్‌లో ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయం, ఆహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చాలా మందికి భోజనాలు అందలేదని బాధితులు కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన తహసీల్దార్‌ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక దళిత యువకుడు తమకు భోజనాలు అందడం లేదని, వైఎస్సార్‌ సీపీ అని వివక్ష చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. ఈలోపు అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్త లక్ష్మణరావు ఫిర్యాదు చేస్తున్న యువకుడిపైకి దూసుకువెళ్లాడు. దీంతో బాధితులు చెబుతుంటే నువ్వెం దుకు జోక్యం చేసుకుంటున్నావు అంటూ కొట్టు సత్యనారాయణ ట్రాక్టర్‌ దిగి కిందకు వెళ్లారు. కొట్టు సత్యనారాయణ ట్రాక్టర్‌ దిగి వెళ్లడం చూసి లక్ష్మణరావు పరుగు లంకించుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అతడిని వెంబడించారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. కొట్టు సత్యనారాయణ అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే కలెక్టర్‌ భాస్కర్‌ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో అధికారులు జరిగిన విషయం వివరించగా, కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్‌ కాపీ తనకు పంపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించినట్టు దీంతో అధికారులు సదరు లక్ష్మణరావును వెతికిపట్టుకుని అతనితో ఫిర్యాదు చేయించినట్టు సమాచారం. కొట్టు సత్యనారాయణపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలంటూ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పోలీసులపై ఒ త్తిడి తెచ్చినట్టు తెలిసింది. అయితే సం ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉండటం, ఘర్షణ జరగకపోవడంతో వారు కేసు పెట్టేందుకు వెనుకాడారు. అయినా ఒత్తిడి ఎక్కువ కావడంతో తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 341, 323 ఐపీసీ సెక్షన్ల కింద కొట్టు సత్యనారాయణ మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

అవినీతిపై మాట్లాడుతున్నందుకే..
ఎర్రకాలువ ఆధునికీకరణ పనులను ముళ్లపూడి బాపిరాజు వర్గానికి చెందిన కాంట్రాక్టర్లే నామినేషన్‌ పద్ధతిపై చేశారని, వారు నాసిరకంగా పనులు చేయడం వల్లే ఎర్రకాలువకు 20 చోట్ల గండ్లు పడి పొలాలు ముంపునకు గురయ్యాయని కొట్టు సత్యనారాయణ విమర్శలు చేశారు. పది నెలల క్రితమే ఎర్రకాలువ పనులను పరిశీలించి నాసిరకంగా చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని కొట్టు సత్యనారాయణ చెప్పారు. కలెక్టర్‌ భాస్కర్‌ అండతోనే బినామీ కాంట్రాక్టులు దక్కించుకుని నాసిరకం పనులు చేశారని కొట్టు సత్యనారాయణ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
వారం రోజులుగా ఎర్రకాలువ వరద సందర్భంగా పలుచోట్ల గండ్లు పడటం, వేల ఎకరాలు నీట మునగడంతో ఆయన చెబుతున్న విషయాలు నూరు శాతం నిజమయ్యాయి. ఈనేపథ్యంలో అవకాశం కోసం చూస్తున్న టీడీపీ నాయకులకు గురువారం నందమూరులో జరిగిన వాగ్వాదం కలిసి వచ్చింది.

న్యాయపరంగా ఎదుర్కొంటాం
తనపై తప్పుడు కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గేది లేదని కొట్టు సత్యనారాయణ అన్నారు. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అవినీతిని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కలెక్టర్‌ భాస్కర్‌ జిల్లాకు ఉన్నతాధికారిలా కాకుండా అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారని, వరద బాధితులకు న్యాయం చేయమని కోరితే తనపై కేసు ఎలా పెట్టిస్తారని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)