amp pages | Sakshi

క్వారంటైన్‌ భోజనం: ఇదేం కక్కుర్తి..?

Published on Sat, 04/18/2020 - 11:03

సాక్షి, శ్రీకాకుళం: కరోనా విజృంభణతో ఊళ్లన్నీ చివురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఇంత ఆపత్కాలంలోనూ కొందరు అక్రమాలు ఆపడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పెద్ద ఎత్తున క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశా రు. ఈ సెంటర్లలో ఉన్న వారికి మంచి భోజనం, వసతి కల్పిస్తున్నారు. అయితే ఈ భోజనం సర ఫరా చేసేందుకు టెండర్లు పిలవగా, కొందరు హోటల్‌ యజమానులు కుమ్మక్కై కోట్‌ చేసి, త ద్వారా వచ్చే లాభాన్ని ముందుగానే పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడి ఈ టెండర్‌ పాట వ్యవహారాన్ని నడిపారు. 

జిల్లాలో 35 క్వారంటైన్‌ సెంటర్లు ఉండగా 768 మందితో నడిచాయి. అయితే, 14 రోజుల నుంచి 21 రోజుల లోపు క్వారంటైన్‌ పూర్తి చేసుకు న్న వారికి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ అని తే లాక కొందర్ని ఇళ్లకు పంపించారు. వీరు పోను ప్ర స్తుతం జిల్లాలో 411 మంది క్వారంటైన్‌లో ఉన్నా రు. వీరికే కాకుండా మరికొంత మందికి మూడు పూటలా భోజనం సమకూర్చారు. తొలి రోజుల్లో 1000 మందికి భోజనం పెట్టినట్టు సమా చారం. అయితే తొలి రోజుల్లో ఎలాంటి టెండర్లు పిలవకుండా కొందరు హోటల్‌ యజమానులకు మూ డు పూట్ల మెరుగైన భోజనం సమకూర్చే బా ధ్యతను నేరుగా అప్పగించారు.

రోజుకి రూ. 380 నుంచి రూ.420వరకు సరఫరా చేసేవారు. అయితే తర్వాత ఎక్కువ ధర అనో, ప్రభుత్వం ఆదేశాలో గానీ క్వారంటైన్‌ సెంటర్లకు భోజనం సమకూర్చేందుకు టెండర్ల ద్వారా సరఫరా కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన టెండర్లు పిలిచారు. జిల్లాలో 14 మంది టెండర్లు దాఖలు చేశారు. 9వ తేదీన టెండర్లు పిలవాల్సిన సమయంలో టెండర్ల నోటిఫికేషన్‌లో చోటు చేసుకున్న లోపాలను గుర్తించారు. ముఖ్యంగా సరఫరా చేసే భోజనం ఎంత పరిమాణంలో ఉండాలి, భోజనాన్ని బాక్సుల ద్వారానే సరఫరా చేయాలన్న విషయాన్ని విస్మరించారు. ఆలస్యంగా గుర్తించిన అంశాలను అప్పటికప్పుడు నోటిఫికేషన్‌లో చేర్చి, ఆ దిశగా కోట్‌ చేయాలని అప్పటికే టెండర్లు వేసిన 14 మందికి అధికారులు సూచించారు.  

ఇదే అవకాశమంటూ..  
అధికారులు ఇచ్చిన అవకాశాన్ని హోటల్‌ యజమానులు అందిపుచ్చుకున్నారు. సిండికేట్‌లో జరిగిన వ్యవహారాలపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. సాధారణంగా టెండర్లు పిలిచినట్టుగానే పిలిచారు. హోటల్‌ యజమానులు మాత్రం బయట కుమ్మక్కై వ్యూహాత్మకంగా బిడ్‌ దాఖలు చేశారు. అతి తక్కువగా రూ. 310కి ఒకరు కోట్‌ చేయగా, మిగతా ఆపై మొత్తాలకు కోట్‌ చేశారు. చెప్పాలంటే క్వారంటైన్‌ సెంటర్లు ప్రారంభమైనప్పుడు సరఫరా చేసే ధర కంటే ఇది తక్కువగా ఉన్నప్పటికీ అంత కంటే తక్కువగానే కోట్‌ చేసే అవకాశం ఉంది. కానీ హోట ల్‌ యజమానులు రింగై ఒకరి చేత తక్కువ కోట్‌ చేయించి, మిగతా వారంతా ఎక్కువ కోట్‌ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.  

రింగైన వారికి చెరో రూ. లక్ష లబ్ధి 
ఇందులో ఒకరికే టెండర్‌ దక్కింది. వ్యూహాత్మకంగా రింగైన వ్యవహారంలో  మిగతా వారికి చెరో రూ.లక్ష చొప్పున ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎలాగూ రూ. 20లక్షల మేర అడ్వాన్సు ఇస్తారని, ఆ మొత్తానికి ముందుగా మీకే ఇచ్చేస్తానని చెప్పి ఒక్కొక్కరికీ రూ. లక్ష విలువైన చెక్కులను ముందుగా అందజేశారు. ఇప్పుడిది హోటల్‌ యజమానుల వర్గాల్లో చర్చనీయాంశమైంది. క్వారంటైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగానైతే వీరికి గిట్టుబాటు కాదు.

కానీ రానున్న రో జుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య 2వేలకు పైగా ఉండొచ్చని, ఆ సమయంలో ఈ ధర తో మరింత గిట్టుబాటు అవుతుందని, ఒక్కొక్కరికీ ఇచ్చిన రూ.లక్ష ఎంతమాత్రం నష్టం కాదనే అభిప్రాయంతో సిండికేట్‌ ముందుకెళ్లినట్టు గుసగుసలు వి నిపిస్తున్నాయి. ఇలా జరిగిన వ్యవహారంపై ఇప్పటికే హోటల్‌ వ్యాపారుల మధ్య ఫోన్‌ సంభాషణలు కూడా జరిగాయి. ఆ సంభాషణలు ఇప్పుడు బయ టకు రావడంతో సిండికేట్‌ వ్యవహారం వాస్తవమే అన్న అభిప్రాయానికి ఊతమిస్తోంది. ఇక్కడొక విషయమేమిటంటే సాధారణంగా టెండర్లు ఖరారు చేసినప్పుడు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3తో సంప్రదింపులు చేసి కోట్‌ చేసిన దాని కన్న తక్కువ ధరకు సరఫరా చేస్తారా? లేదా అన్నదానిపై చర్చించాలి. ఇక్కడదేమీ జరగలేదు.  

మాకేం తెలీదు..  
క్వారంటైన్‌ కేంద్రాలకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్ట్‌ విషయమై నలుగురు అ«ధికారుల బృందం నిర్ణయం తీసుకుంది. చివరి క్షణంలో గుర్తించిన అంశాలను చేర్చి టెండర్లు దాఖలు చేయాలని హోటల్‌ యజమానులను కోరాం. ఎవరైతే తక్కువ కోట్‌ చేశారో వారి వివరాలతో కూడిన ఫైల్‌ను జాయింట్‌ కలెక్టర్‌కు సమర్పించాం. అన్నీ సవ్యంగా ఉన్నాయని జాయింట్‌ కలెక్టర్‌ కాంట్రాక్ట్‌ తుది నిర్ణయం తీసుకున్నారు. అంతకుమించి బయటేమి జరిగిందో మాకు తెలీదు.  
– బి.దయానిధి, డీఆర్‌ఓ, శ్రీకాకుళం  

తక్కువకు కోట్‌ చేశారని ఖరారు చేశాం 
క్వారంటైన్‌ కేంద్రాలకు భోజనం సరఫరా చేసేందుకు ఎవరైతే తక్కువ కోట్‌ చేశారో వారికి టెండర్‌ ఖరారు చేశాం. బయట జరిగిన వ్యవహారాలు మాకు తెలీవు. సిండికేట్‌ అయ్యారని తెలి స్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మళ్లీ టెండర్లు పిలుస్తాం. లేదంటే భోజనం సరఫరా చేసినప్పుడు తేడాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్, శ్రీకాకుళం   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)