amp pages | Sakshi

మా జీవితాల్లో వెలుగులు నింపండి..

Published on Mon, 10/22/2018 - 07:29

విజయనగరం :  ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విద్యుత్‌ శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విజయనగరం జిల్లా ప్రతినిధులు జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రామభద్రాపురం మండలం రొంపిల్లి వద్ద  జననేతను ఆదివారం కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇరవై సంవత్సరాలుగా విద్యుత్‌ శాఖలో ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి రెగ్యులర్‌ చేయాలని కోరారు.

అందరికీ వెలుగులు పెంచే తాము చీకట్లో మగ్గాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి  కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన అకాల మరణం తర్వాత తమనెవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు.  తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం అక్కడి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయగా.. మన రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులున్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు.  

అవస్థలు పడుతున్నా...
ఏ పని చేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు. భర్త లేకపోవడంతో ఇద్దరు పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ప్రతి నెలా ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్‌తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయితే రెండు వేల రూపాయల పింఛన్‌ ఇస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎందరో అభాగ్యులకు ఆసరా దొరుకుతుంది.   – గిరిడి సుశీల, పారాది గ్రామం , బొబ్బిలి మండలం

ఆదుకుంటామన్నారు...
బోన్‌ క్యాన్సర్‌ రావడం వల్ల నా కూడి భూజాన్ని పూర్తిగా తొలగించారు. చేయి లేకపోవడం వల్ల ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. ఆదుకోవాలని జగన్‌బాబును కోరాను. అధికారంలోకి రాగానే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. –  పిట్ట రాములమ్మ,   ఎస్‌.సీతారామపురం, రామభద్రపురం మండలం

పొంచి ఉన్న ముప్పు
పారాదిలో ప్రవహిస్తున్న వేగావతి నది వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌ను నిర్వహిస్తుండడంతో గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఇసుక తవ్వకాల వల్ల నదీ పరీవాహక ప్రాంతం కోతకు గురవుతోంది. దీంతో గ్రామం ముంపు భారిన పడే అవకాశం ఉంది. అలాగే నదిపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో కూడా ఆరేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత మా బతుకులు బాగుపడతాయన్న ఆశ ఉంది.–  ఎస్‌. పైడిరాజు, ఎ.ప్రసాద్, పారాది గ్రామం, బొబ్బిలి మండలం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)