amp pages | Sakshi

అత్యవసర సేవపై ‘సమ్మెట’

Published on Thu, 02/22/2018 - 13:04

విజయనగరం మున్సిపాలిటీ: ప్రాణాలకు తెగించి రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకు 20 ఏళ్లుగా విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయటంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో బుధవారం నుంచి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లగా... ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలోగల 800 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. అంతేగాకుండా స్థానిక దాసన్నపేట విద్యుత్‌ భవనం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. సమ్మెలోకి వెళ్లిన వారిలో 133కేవీ, 33కేవీ, 220కేవీ సబ్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే కార్మికులతోపాటు పీక్‌ లోడ్‌ ఆపరేటర్లు, షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, వాచ్‌ అండ్‌ వార్డ్‌ సిబ్బంది, టెన్‌మన్‌ గ్యాంగ్, మీటర్‌ రీడర్‌లు ఉన్నారు.

విద్యుత్‌ సేవలపై ప్రభావం....!
విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో 800 మంది కార్మికులు పనిచేస్తుండగా క్షేత్ర స్థాయిలో వీరి సేవలే ముఖ్యం. వీరంతా బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్‌ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి రెగ్యులర్‌ ఉద్యోగులతో సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

రాతపూర్వక హామీ ఇస్తేనే...
కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం రాత పూర్వక హమీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికుల జిల్లా జేఏసీ కన్వీనర్‌ గోవిందరావు స్పష్టం చేశారు. అప్పటి వరకు శాంతియుత మార్గంలో విధులు బహిష్కరించి తమ నిరసన కొనసాగిస్తామన్నారు. స్థానిక దాసన్నపేట విద్యుత్‌ భవనం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్‌  కా ర్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి, విద్యుత్‌ కంపె నీలకు  వినతిపత్రాలతో పాటు సమ్మెనోటీసులు ఇచ్చామనీ, వారినుంచి సానుకూల స్పందన లే నందునే సమ్మె నిర్ణయం తీసుకున్నామన్నారు. తక్షణమే కాంట్రాక్ట్‌ కార్మికులను  రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రెగ్యులర్‌ ఉద్యోగులు మద్దతి వ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ విద్యు త్‌  కార్మికుల జేఏసీ నాయకులు ఎన్‌.వెంకటఅప్పారావు, వి.సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

చర్చల పేరిట ప్రభుత్వ కాలయాపన
విద్యుత్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను  దశల వారీగా క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కాంట్రాక్ట్‌ విద్యుత్‌ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో  కార్మికులంతా కొన్నేళ్లుగా పోరుబాట పట్టారు. ప్రభుత్వం చర్చల పేరిట జేఏసీ నాయకులతో మాట్లాడటమే తప్ప సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హమీ, ప్రకటన చేయటం లేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయగా... మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో కార్మికులు భగ్గుమంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించగా... రాష్ట్ర విద్యుత్‌ శాఖమంత్రి  కళావెంకట్రావు జేఏసీ నాయకులను చర్చల పేరిట  ఆహ్వానించటంతో బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం గడువు కోరటంతో ససేమిరా అన్న జేఏసీ నాయకులు విధులు బహిష్కరించి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)