amp pages | Sakshi

‘కొటక్‌’కు భారీ వడ్డన

Published on Wed, 07/31/2019 - 08:35

సాక్షి, విశాఖ ‌: వినియోగదారునికి సేవా లోపం కలిగించినందుకు నష్టపరిహారం చెల్లించాలని నగరంలోని 2వ వినియోగదారుల మండలి అధ్యక్షురాలు చావలి సూర్య భాస్కరం మంగళవారం తీర్పునిచ్చారు. వినియోగదారుడు తనఖా పెట్టిన ఇంటిని తక్షణమే విడుదల చేయాలని, చెల్లించిన లక్షా 15వేలు తిరిగి చెల్లించాలని, నష్టపరిహారం కింద రూ.4 లక్షలు, కోర్టు ఖర్చులకు మరో 2,500 ఇవ్వాలని నగరంలోని వాల్తేరు ప్రాంతంలోని కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ని ఫోరం ఆదేశించింది. బాధితులు ఎస్‌.వినీత్‌ (3) విజయశ్రేయల్‌(4)ల తరఫున వారి పెద్దనాన్న డాక్టర్‌ ఎస్‌. శ్రీనివాసరావు ఫిర్యాదు దాఖలు చేశారు. 

కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. చిన్నారుల తండ్రి ఎస్‌.విజయ్‌కుమార్‌ (శ్రీనివాసరావు సోదరుడు) మధురవాడ దగ్గర ఎఆర్‌ ఎన్‌క్లేవ్‌లో 2015 నవంబర్‌ నెలలో ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. ఇందుకోసం కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ వాల్తేరు శాఖలో రూ.22 లక్షలు అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా విజయ్‌కుమార్‌ భార్య ఎన్‌.శాంతిరత్నం ఉన్నారు. ఇంటిపై అప్పు తీసుకున్నప్పుడే ఐసీఐసీఐ లంబా బీమా కంపెనీలో బీమా చేయించారు. ఈ నేపథ్యంలో శాంతిరత్నం 2017 ఫిబ్రవరి 11వ తేదీన గుండె పోటుతో మరణించారు. తర్వాత నెల రోజులకే విజయ్‌కుమార్‌ కూడా తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలకు  పెద్దనాన్న శ్రీనివాసరావే ఆసరా అయ్యారు. రుణం వాయిదాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంక్‌ సిబ్బంది చేసిన ఒత్తిడితో అతను లక్షా 15వేలు చెల్లించారు.

ఇంటిని బీమా చేయించిన విషయం తెలియడంతో సంబంధిత పత్రాలను తన న్యాయవాది ఏవీసీఎన్‌ నాగేశ్వరరావు ద్వారా ఫోరంకి సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇంటిపై అప్పుతీసుకుని, తనఖా పెట్టినప్పుడు బీమా కలిగి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. బీమా అమల్లో ఉన్న సమయంలో రుణగ్రహీత, జామీనుదారురాలు మృతి చెందినందున బీమా కంపెనీయే రుణం చెల్లించాలన్నారు. బీమా కంపెనీ నుంచి బ్యాంక్‌ డబ్బులు తీసుకోవాలన్నారు. ప్రధాన వ్యక్తులు ఇద్దరూ మృతి చెందిన నాటికి బీమా అమల్లో ఉన్నా ఆ విషయాన్ని బ్యాంకు దాచిపెట్టడాన్ని ఫోరం ఆక్షేపించింది. తాకట్టులో ఉన్న ఇంటిని తక్షణమే రద్దుచేసి బాధితులకు అప్పగించాలని తీర్పులో పేర్కొన్నారు.   

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌