amp pages | Sakshi

ఆక్వా హామీలు మరిచి'నారా'!

Published on Sun, 06/17/2018 - 07:58

ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హమీలు నీటిమీద రాతలుగా మారాయి. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని చేసిన ప్రకటనపై ఇంకా అధికారిక ఆదేశాలు రాలేదు. సీఎం సమక్షంలో ప్రతి కౌంట్‌కు రూ.30 చొప్పున పెంచుతామని వ్యాపారులు రైతులకు ఇచ్చిన మాటా నిలబెట్టుకోలేదు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగిన ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు రొయ్యల ధరలు పెంచేలా చర్యలు తీసుకుంటామని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలు మూడు వారాలు దాటినా అమలులోకి రాలేదు. ప్రతి కౌంట్‌కు రూ.30 పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకూ రూ.పది నుంచి రూ.20లోపే పెరిగాయి. 

జగన్‌ వరాలతో కదలిక..
ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో 
ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

 ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌ రూ.3.80 నుంచి రూ.1.50కి తగ్గిస్తానని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.ఏడు నుంచి రూ. ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతానని భరోసా ఇచ్చారు.  ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటిస్తానని వరాలిచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. 

హడావుడిగా సమావేశం 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నెల 26న హడావుడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. ఆ సమావేశంలో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు ప్రతి కౌంట్‌కు రూ.30 చొప్పున పెంచుతామని ముఖ్యమంత్రి సమక్షంలో హామీ ఇచ్చారు.ఆ సమావేశం జరిగిన రెండు రోజులకు రూ.పది  పెంచగా మరో పది రోజులకు మరో రూ.పది ధర పెంచారు. దీంతో ఇప్పటి వరకూ ప్రతి కౌంట్‌కు రూ.20 మాత్రమే పెరిగింది.  ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు నుంచి ధరలపై సమీక్ష జరిపిన పాపాన పోలేదు. మరోవైపు విద్యుత్‌ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రూ.రెండుకు తగ్గిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. వచ్చేనెల నుంచి అయినా అమలు చేస్తారన్న ఆశతో ఆక్వా రైతులు ఉన్నారు.

హామీ నిలబెట్టుకోలేదు
ఆక్వా రంగాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలు కాలేదు. ప్రతి కౌంట్‌కు రూ.30 పెంచుతామన్న మాటను నిలబెట్టుకోలేదు. ఇప్పటి వరకు రూ.20 మాత్రమే పెరిగింది. మరో రూ.పది పెంచడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. తమను చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. విద్యుత్‌ చార్జీల తగ్గింపుపై కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాలి.
– వేగేశ్న సత్యనారాయణరాజు, భీమవరం, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు  

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)