అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్
Published on Thu, 06/27/2019 - 16:26
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన లోటస్పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్తో భేటీ అయ్యేందుకు సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.
రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలకు సత్వర ముగింపు పలికేందుకు ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28, 29 తేదీల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి.
Tags