amp pages | Sakshi

అన్నివిధాలా ఆదుకుంటాం

Published on Wed, 10/22/2014 - 02:55

కాకినాడ క్రైం / పిఠాపురం :వాకతిప్ప పేలుడు బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సోమవారం నాటి దుర్ఘటనలో బాధితులైన వారిని పరామర్శించేందుకు ఆయన మంగళవారం జిల్లాకు వచ్చారు. విజయవాడ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణం చేరుకున్నారు.
 
 ఉదయం 10.30 గంటలకే సీఎం వస్తారని చెప్పినా ఆయన కాకినాడ చేరుకునే సరికి మధ్యాహ్నం 3.30 గంటలైంది. పోలీసు కార్యాలయం ప్రాంగణం నుంచి కారులో కాకినాడ జీజీహెచ్ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పరిశీలించారు.  మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటన జరిగిన తీరు, మృతులు, చికిత్స పొందుతున్న వారి వివరాలు కలెక్టర్ నీతూప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని బాణ సంచా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
 కాకినాడ నుంచి కారులో వాకతిప్ప వెళ్లారు. అక్కడ ఎస్సీ కాలనీ వద్ద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత అనుకున్న దాని ప్రకారం ఆయన దుర్ఘటన స్థలానికి వెళ్లాల్సి ఉంది. అయితే సమయం లేనందున వెనుదిరిగారని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చెప్పారు. ముఖ్యమంత్రి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ రాముడు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు ఉన్నారు.
 
 కాగా దుర్ఘటన స్థలం వద్ద ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్న వారు ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే ముఖ్యమంత్రికి అత్యవసరమైన పని ఉందని, చీకటి పడుతుండడం వల్ల వెనుదిరిగారని ఎమ్మెల్యే వర్మ వారికి వివరించారు.  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.3 లక్షలకు పెంచారని, ఐఏవై గృహాలు నిర్మిస్తారని, మృతుల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆదేశించారని చెప్పారు.
 
 తహసీల్దారు సస్పెన్షన్
 కాగా పేలుడు ఘటనకు బాధ్యుడిగా కొత్తపల్లి తహసీల్దారు పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే వర్మ తెలిపారు. అనుమతి లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా, జనసమ్మర్దం గల ప్రాంతలో మందుగుండు సామగ్రి తయారు చేసి విక్రయిస్తుంటే తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే ప్రమాదానికి ఆయనను బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారని వివరించారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)