అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆగని గర్భశోకం
Published on Sun, 05/06/2018 - 10:40
మన్యంలో కన్నతల్లుల గర్భశోకం కొనసాగుతుంది. ఘటన జరిగిన సమయంలో అధికారులు చేసిన హడావుడి ...ఇచ్చిన హామీలు చేతల్లో కానరాకపోవడంతో కన్ను తెరవకముందు కొందరు...కన్ను తెరిచిన కొద్ది రోజులకు మరికొందరు కన్నుమూస్తున్నారు.
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పసిపాప శనివారం మృతి చెందింది. అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామానికి చెందిన మడకం దొరబాబు, వెంకటలక్ష్మి దంపతుల రెండో బిడ్డ అయిన ఐదు నెలల పాప అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను అడ్డతీగల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆ పాప మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
#
Tags