amp pages | Sakshi

మరో గర్భశోకం

Published on Wed, 10/25/2017 - 13:09

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు జాయినైతే చాలు ‘క్రిటికల్‌’ అని ముద్ర వేసి రాజమహేంద్రవరంలోని  వైద్య విధాన పరిషత్తు జిల్లా ఆసుపత్రికి తరలించేస్తున్నారు. క్రిటికల్‌ అనే కేసులను 108 సిబ్బంది మార్గం మధ్యలో డెలివరీలు చేసేస్తున్నారంటే వైద్యుల్లో ఏమేరకు నిర్లక్ష్యం ఆవహించి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా...

తూర్పుగోదావరి ,రంపచోడవరం: అమ్మ గర్భగుడి నుంచి బయట ప్రపంచంలోకి వచ్చి కళ్లు తెరవకుండానే పసి కందులకు నిండూ నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవా లు సురక్షితమని ఓ వైపు చెబుతున్నా ఆ ఆ సుపత్రుల్లో గర్భిణులకు వైద్య సేవలు అం దడం లేదు. ఏజెన్సీలో ఎంత మంది పసికందుల ప్రాణాలు పోతే ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడతాయని పురిటిలోనే పిల్లలను కోల్పోయిన తల్లులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతమంది పసికందుల కళ్లు మూస్తే అధి కారులు కళ్లు తెరుస్తారోనని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రం పచోడవరం ఏరియాఆసుపత్రిలో మారేడుమిల్లిమండలం చావి డికోటగ్రామానికి చెందిన బత్తుల ప్రేమలత అనే గర్భిణి కాన్పు లోనే పసికందును కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తోంది.

పురిటి నొప్పులతో బాధ పడుతున్నా పట్టించుకోని వైనం...
చావిడికోట గ్రామం నుంచి ప్రేమలత సోమవారం మధ్యాహ్నం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇన్‌ పేషెంట్‌గా చేరింది. ఆ సమయంలో వైద్యులు పరీక్ష చేసి బాగానే ఉందని ఆసుపత్రిలోనే ఉంచారు. అదే రోజు రాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతుండడంతో బాధితురాలి అత్త అక్కడే ఉన్న నర్సులకు చెప్పినా చిరాకు పడ్డారే తప్ప ప్రాథమిక వైద్యం కూడా అందించలేదు. ప్రధాన వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో బాధతో నరకయాతన అనుభవించింది. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయం మళ్లీ వచ్చి ప్రాధేయపడడంతో నర్సులు వచ్చి చూసేసరికే ప్రాణం పోయింది.

గర్భిణులకు వైద్యం అందే పరిస్ధితి లేదా...
రంపచోడవరంఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు కనీస వైద్యం అందించి భరోసానివ్వడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వి ఫలమవుతున్నారని ఇటీవల జరిగిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. వచ్చిన కేసులు క్రిటికల్‌గా ఉన్నాయని రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. విషమంగా ఉన్నయన్న కేసులు మార్గమ«ధ్యలో 108 సిబ్బంది సుఖ ప్రసవం చేయడం విశేషం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కేసుల రిఫర ల్‌ పరిశీలిస్తే ఏప్రిల్‌ నెలలో 27 మంది గర్భిణులను రిఫర్‌ చేయగా మేలో 28 మంది, జూన్‌లో 26 మంది, జూలైలో 55 మంది, ఆగస్టులో 55, సెప్టెంబర్‌లో 21 మంది గర్భిణి కేసులను రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఒక గైనిక్‌ వైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించా రు. సెలవు పెట్టినప్పుడు, రాత్రి సమయాల్లో ప్రాణంమాదకు వస్తోంది. సోమవారం మృతశిశువు జనన ఘటనపై ఆసుపత్రి ఇన్‌చార్జి కార్తీక్‌ను వివరణ కోరగా పురిటి నొప్పుల విషయం డ్యూటీలో ఉన్న సిబ్బంది తనకు చెప్పలేదని తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)