amp pages | Sakshi

మాఫీ పేరుతో బంగారు మాయ

Published on Sun, 09/06/2015 - 23:51

రాజమండ్రి : వ్యవసాయ రుణమాఫీ అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. సీఎం సంతకం చేసేనాటికి జిల్లాలోని ఆరు లక్షలకు పైగా రైతు ఖాతాల్లో రూ.2,350 కోట్ల పంట రుణాలు, మరో రూ.3,860 కోట్ల బంగారు ఆభరణాల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం రూ.6,210 కోట్ల రుణాలున్నట్టు. అయితే తొలినాళ్లలోనే రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయకపోవడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన విధించడం, వాణిజ్య రైతులకు మాఫీ వర్తింపజేయకపోవడం ద్వారా  ప్రభుత్వం రుణమాఫీ భారాన్ని చాలావరకూ వ్యూహాత్మకంగా వదిలించుకుంది.

 వాయిదాల పద్ధతిలో చెల్లింపులు
 రుణమాఫీలో రూ.50 వేలకు పైబడి, రూ.1.50 లక్షల లోపు ఉన్నవాటిని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది. దీంతో రైతులకు రుణం పూర్తిగా రద్దు కాక బంగారం చేతికి రాకుండా పోయింది. ఇటువంటి రుణాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా బాండ్లు అందజేసినప్పుడే బంగారం తిరిగిస్తామని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో గత ఖరీఫ్‌లోనే కాకుండా, ఈ ఏడాది ఖరీఫ్‌లో సైతం రుణాలందక రైతులు బయట అప్పులు చేస్తున్నారు. మాఫీ సొమ్మును ప్రభుత్వం మూడు విడతలుగా బ్యాంకులకు జమ చేసింది.

తొలి విడతలో 3.35 లక్షల మందికి రూ.348 కోట్లు రుణమాఫీ ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో రూ.260 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసి, రూ.88 కోట్లు పక్కన పెట్టింది. రెండో దశలో లక్ష మందికి రూ.222 కోట్లు జమ చేయగా, మూడో విడతలో రూ.43 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తమ్మీద ఇప్పటివరకూ రూ.525 కోట్ల రుణమాఫీ నిధులు రాగా, ఇందులో సుమారు రూ.210 కోట్లు మాత్రమే బంగారంపై రుణాలు మాఫీ అయ్యాయన్నది బ్యాంక్ వర్గాల అంచనా. మొత్తం బంగారు రుణాలు రూ.3,860 కోట్లు కాగా, రూ.210 కోట్లు (6 శాతం) మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిసి రైతులు లబోదిబోమంటున్నారు.

ఇదే సమయంలో బ్యాంకులు రైతుపత్రాలు తప్పుగా నమోదు చేయడం, సొసైటీల్లో డూప్లికేషన్ వంటి కారణాలతో మంజూరైన నిధుల్లో రూ.16 కోట్లు వెనక్కి మళ్లిపోయాయి. దీంతో అర్హులైనా సుమారు 13 వేల మంది మాఫీకి నోచలేదు. మాఫీపై ఆశలు పెట్టుకుని సకాలంలో రుణాలు చెల్లించని రైతులు 14 శాతం వడ్డీ భారం మోయడంతోపాటు, వేలం ప్రకటనతో అప్పు తీర్చేందుకు బయట మూడు నాలుగు రూపాయలకు అప్పులు చేయాల్సి వస్తోంది. బంగారంపై రుణాలు తీసుకున్న సమయంలో అప్పటి బంగారం విలువ ప్రకారం గ్రాముకు రూ.2వేల చొప్పున ఇచ్చేవారు.

బంగారం ధర ఇప్పుడు తగ్గడంతో గ్రాముకు రూ.1700కు మించి ఇవ్వడంలేదు. బంగారం దక్కించుకునేందుకు అప్పు చేసి వడ్డీ చెల్లించాలనుకునే రైతులకు ఇప్పుడు అసలులో కూడా కొంత కట్టాల్సి రావడం భారంగా మారింది. బంగారంపై పంట రుణాలు తీసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలుదారులే. రుణం తీర్చేందుకు, ఇప్పుడు సాగు చేసేందుకు ఒకేసారి అప్పులు చేయాల్సిన దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. ఇది తలకు మించిన భారం కావడంతో కౌలుదారులు సాగును వదిలేసుకుంటున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.
 
 మాఫీ మాయలెన్నో!
  మండపేట మండలం తాపేశ్వరం శివారుకు చెందిన కౌలు రైతు కడియాల బుల్లబ్బాయి (29) ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లలో రూ.2.50 లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. భార్యాపిల్లల బంగారం కూడా కుదువ పెట్టాడు. ఇది మాఫీ కాకపోగా, రైతుమిత్ర గ్రూపు నుంచి తీసుకున్న రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకు రుణం మాఫీ కాక, అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడు.

  పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో 400 మంది బంగారంపై రూ.50 లక్షల రుణాలు తీసుకున్నారు. ఒక్క రైతుకూ నయాపైసా రుణం మాఫీ కాలేదు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో అవి పంట రుణాలు కాదని, సాధారణ రుణాలని నివేదికలు పంపారు. దీంతో ఇవి మాఫీలోకి రాలేదు.

  కాకినాడ రూరల్ మండలంలో 3,793 మంది బంగారు రుణాల మాఫీకోసం దరఖాస్తు చేసుకోగా 1097 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మిగిలినవారు 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది.

  కొత్తపేట నియోజకవర్గంలోని 37 బ్యాంకుల్లో సుమారు రూ.30 కోట్ల వరకూ బంగారు రుణాలుండగా, ఇక్కడ 10 శాతం కూడా రుణాలు మాఫీ కాలేదు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)