amp pages | Sakshi

హామీల అమలుకు ఇచ్చే నిధులే ప్యాకేజీయా!

Published on Sun, 08/30/2015 - 02:10

చంద్రబాబు అసమర్థత వల్లే హోదా రావడం లేదు
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ

 
 హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన హామీల అమలుకు కేంద్రం ఇచ్చే నిధులను ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడ డం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజీ అనేది రాష్ట్ర ప్రజల హక్కు, కేంద్రం ఇచ్చి తీరాల్సిన అంశమని చెప్పారు. కానీ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని బొత్స స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇంకా గట్టిగా పోరాడుతామన్నారు. చంద్రబాబు అసమర్థత, స్వార్థ ప్రయోజనాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు.

తాము మాత్రం వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హోదా కోసం గట్టిగా పోరాటం చేయాల్సింది పోయి తాము చేస్తున్న బంద్‌ను విఫలం చేసే కుతంత్రాలకు సీఎం పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రయోజనం లేదని బిహార్ సీఎం నితీష్‌కుమార్ చెప్పారని గుర్తుచేశారు. రాజధాని భూముల సేకరణ విషయంలో మంత్రి నారాయణ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సీఎంకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారన్నారు. 22 మంది సబ్ కలెక్టర్లను భూసేకరణకు నియమించే విషయంలో సీఎంకు తెలియకుండా ఆదేశాలు జారీ అవుతాయా? అని బొత్స ప్రశ్నించారు.

 అణచివేతతో పంతం పెరిగింది: ఉమ్మారెడ్డి
 చంద్రబాబు ప్రభుత్వం బంద్‌పై అణచివేత వైఖరికి దిగడంతో ప్రజల్లో పట్టుదల, పంతం పెరిగాయని, వారంతా రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బంద్‌ను విఫలం చేయడానికి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డారని విమర్శించారు. 15 నెలలుగా ప్రత్యేక హోదా సాధించలేకపోయిన సీఎం ప్రజా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడటం పూర్తి అవివేకమన్నారు. బంద్ రోజున ప్రజల తమ సత్తా చాటారని, చంద్రబాబు దీన్ని గ్రహించాలని హితవు పలికారు.
 
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)