amp pages | Sakshi

‘చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైంది’

Published on Thu, 02/23/2017 - 12:51

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందని, రానున్న రోజుల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని వైఎస్ఆర్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి హామీపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖకు చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలన్నారు. ఇవేమీ చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ప్రచార ఆర్భాటం తప్పా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఊకదంపుడు ఉపాన్యాసాలు ఆపి హామీలు నెరవేర్చాలని సూచించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను మహిళా పార్లమెంట్ సదస్సుకు పిలిచి అవమానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసుల వైఖరి అభ్యంతకరమని, దాన్ని పోలీసు అధికారుల సంఘం సమర్థించడం సరికాదని అన్నారు. పోలీసులు చంద్రబాబు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరారు.