కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
Breaking News
డేటా చోరీ కేసు : పక్కదోవ పట్టించేందుకు బాబు యత్నం
Published on Tue, 03/05/2019 - 16:05
సాక్షి, అమరావతి : ప్రస్తుతం ఐటీ గ్రిడ్ స్కామ్ టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అక్కడ విచారణ జరుగుతుంటే.. ఇక్కడ చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోంది. ఏపి క్యాబినెట్లో డేటా చోరీ కేసుపై చంద్రబాబు చర్చిండడమే దీనికి నిదర్శనం. మంత్రులు, అధికారులతో డేటా చోరిపై చంద్రబాబు మంగళవారం సమీక్ష జరిపారు.
డేటా చోరికేసును పక్కదోవ పట్టించేందుకు తెలంగాణ తో పెండింగ్లో ఉన్న వివాదాలను తెరపైకి తేవాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి ఆస్తుల విభజన, షెడ్యూల్ 9, 10 సంస్థల పంపిణీ పై కోర్టుకెళ్లే అంశాలపై పరిశీలించాలనీ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ, టీఆర్ఎస్లపై ఎందుకు విమర్శలు చేయట్లేదని మంత్రులకు గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం.
Tags