amp pages | Sakshi

కృష్ణా బోర్డుకు బాబు ఫిర్యాదు

Published on Sat, 10/25/2014 - 01:33

  • శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై తక్షణం స్పందించండి
  •   నిల్వలు పడిపోతే రాయల సీమకు నీటి కష్టాలు తప్పవని వెల్లడి
  •   జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికీ ఏపీ సర్కారు లేఖ
  •  
     సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తే రాయలసీమకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందని కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. నీటి కొరత వల్ల శ్రీశైలం కుడి కాల్వ, కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట చేతికందకుండా పోతుందని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఈ నెల 21న కృష్ణా బోర్డు ఇచ్చిన ఆదేశాలనూ తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డు తక్షణం జోక్యం చేసుకొని ఏపీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బోర్డు చైర్మన్ పండిత్ శుక్రవారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. 
     
    సమస్య పరిష్కారానికి తన పరిధిలో అన్ని చర్యలు చేపడతానని పండిత్ హామీ ఇచ్చారు. బోర్డు నిస్పాక్షికంగా వ్యవహరిస్తుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుందని చెప్పారు. వచ్చే వారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను చర్చిస్తామన్నారు. కాగా, ఈ భేటీకి ముందే ఈ వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఏపీ సర్కారు లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా పడిపోతోందని, బోర్డు ఆదేశాలనూ పరిగణించనందున తక్షణం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కేంద్ర జల వనరుల  శాఖకు విజ్ఞప్తి చేసింది. రాయలసీమలో పూర్తిగా పంట నష్టపోయే ప్రమాదముందని, ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగవచ్చని, శాంతి భద్రతలకూ విఘాతం కలిగే ప్రమాదముందని ఏపీ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద కూడా తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో భారీగా నీరు దిగువకు విడుదలవుతున్న విషయంపై ఏపీ అధికారులు చర్చించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)